Government Doctors Negligence: వర్ధన్నపేటలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. వరంగల్ జిల్లాల వర్ధన్నపేటలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ ప్రాణాల మీదికి తెచ్చింది. డెలివరీ చేసిన తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ కోసం పెట్టిన కాటన్ మరిచిపోవడంతో ఇన్ఫెక్షన్ కి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. అయితే తప్పును కప్పిపుచ్చుకునేందుకు నిందను పేషెంట్ మీదికే నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలింత ప్రాణాలతో ప్రభుత్వ వైద్యులు చెలగాటమాడిన సంఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు భవానికుంట తండాకు చెందిన నునావత్ సౌజన్య దేవేందర్ దంపతులు. సౌజన్య గర్భవతి కావడంతో జూన్ 16తేదీన పురిటి నొప్పుల రావడంతో 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో నార్మల్ డెలివరీ అయింది. కొడుకు పుట్టాడు. అనంతరం వైద్య చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం రావడంతో సౌజన్యను అడ్మిట్ చేసుకుని వైద్యులు చికిత్స అందించారు. అప్పుడే ప్రసవం కావడంతో సౌజన్యకు రక్తస్రావం ఎక్కువ పోవడం గమనించిన వైద్యులు చిన్న ఆపరేషన్ చేయాలని చెప్పారు. చిన్న ఆపరేషన్ చేసేటప్పుడు యోనిలో దూది అమర్చి అలాగే కుట్లు వేశారని, డిశ్చార్జ్ చేసే సమయంలో కూడా దూదిని తీయడం మరిచిపోయారు.
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత బాలింత తీవ్ర కడుపునొప్పి, రక్త స్రావంతో బాధపడుతుండడంతో వరంగల్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా వైద్యులు యోనిలో దూది మరిచిపోయిన్నట్లు తెలిపారు. ఓవైపు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రభుత్వాసుపత్రికి రావాలంటే భయం అవుతుందని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ప్రాణాలతో చెలగాట మాడిన వైద్యులు తీరు పట్ల భర్త తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. విధుల్లో అలసత్వం నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్య తీసుకోవాలని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నరసింహస్వామి ని బాధితుడు కోరారు .
సంఘటనకు సంబంధించి డాక్టర్ సూపరింటెండెంట్ నరసింహస్వామిని వివరణ కోరగా రాత్రి సమయంలో 108లో ప్రసవం అయిన వచ్చిన సౌజన్య అధిక రక్తస్రావం జరగడంతో చిన్న ఆపరేషన్ చేసి, కాటన్ పెట్టి 2రోజులు ఆస్పత్రిలో చికిత్స చేసి మరో రెండు రోజుల్లో ఆస్పత్రికి రావాలని బంధువులకు తెలిపామని, కానీ వారు ఆలస్యంగా రావడంతో ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. బాధితురాలికి ప్రత్యేక చికిత్స చేసినట్లు, ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నట్టు, తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని సూపరింటెండెంట్ తెలిపారు.
World Population: 2100 నాటికి చైనా, ఇండియాలో భారీగా తగ్గనున్న జనాభా.. కారణాలు ఏంటంటే..?
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?