Government Doctors Negligence: వర్ధన్నపేటలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. వరంగల్ జిల్లాల వర్ధన్నపేటలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ ప్రాణాల మీదికి తెచ్చింది. డెలివరీ చేసిన తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ కోసం పెట్టిన కాటన్ మరిచిపోవడంతో ఇన్ఫెక్షన్ కి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. అయితే తప్పును కప్పిపుచ్చుకునేందుకు నిందను పేషెంట్ మీదికే నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలింత ప్రాణాలతో ప్రభుత్వ వైద్యులు చెలగాటమాడిన సంఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు భవానికుంట తండాకు చెందిన నునావత్ సౌజన్య దేవేందర్ దంపతులు. సౌజన్య గర్భవతి కావడంతో జూన్ 16తేదీన పురిటి నొప్పుల రావడంతో 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో నార్మల్ డెలివరీ అయింది. కొడుకు పుట్టాడు. అనంతరం వైద్య చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం రావడంతో సౌజన్యను అడ్మిట్ చేసుకుని వైద్యులు చికిత్స అందించారు. అప్పుడే ప్రసవం కావడంతో సౌజన్యకు రక్తస్రావం ఎక్కువ పోవడం గమనించిన వైద్యులు చిన్న ఆపరేషన్ చేయాలని చెప్పారు. చిన్న ఆపరేషన్ చేసేటప్పుడు యోనిలో దూది అమర్చి అలాగే కుట్లు వేశారని, డిశ్చార్జ్ చేసే సమయంలో కూడా దూదిని తీయడం మరిచిపోయారు.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత బాలింత తీవ్ర కడుపునొప్పి, రక్త స్రావంతో బాధపడుతుండడంతో వరంగల్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా వైద్యులు యోనిలో దూది మరిచిపోయిన్నట్లు తెలిపారు. ఓవైపు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రభుత్వాసుపత్రికి రావాలంటే భయం అవుతుందని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ప్రాణాలతో చెలగాట మాడిన వైద్యులు తీరు పట్ల భర్త తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. విధుల్లో అలసత్వం నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్య తీసుకోవాలని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నరసింహస్వామి ని బాధితుడు కోరారు .
సంఘటనకు సంబంధించి డాక్టర్ సూపరింటెండెంట్ నరసింహస్వామిని వివరణ కోరగా రాత్రి సమయంలో 108లో ప్రసవం అయిన వచ్చిన సౌజన్య అధిక రక్తస్రావం జరగడంతో చిన్న ఆపరేషన్ చేసి, కాటన్ పెట్టి 2రోజులు ఆస్పత్రిలో చికిత్స చేసి మరో రెండు రోజుల్లో ఆస్పత్రికి రావాలని బంధువులకు తెలిపామని, కానీ వారు ఆలస్యంగా రావడంతో ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. బాధితురాలికి ప్రత్యేక చికిత్స చేసినట్లు, ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నట్టు, తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని సూపరింటెండెంట్ తెలిపారు.
World Population: 2100 నాటికి చైనా, ఇండియాలో భారీగా తగ్గనున్న జనాభా.. కారణాలు ఏంటంటే..?
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!