Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ గ్రామస్తులు.. పుష్కరాన్ని తలపించిన నెరడ పెద్ద చెరువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahbubabad: మహబూబాబాద్ జిల్లాలో చేపల చెరువు లూటీకి గురైంది. వేల సంఖ్యలో గ్రామస్తులు చెరువు దగ్గరకు వచ్చి చెరువులో చేపలను పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నెరడ పెద్ద చెరువులో మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా, వేల సంఖ్యలో గ్రామస్తులు చేపలు పట్టేందుకు తరలివచ్చారు. దీంతో ఆ చెరువంతా పుష్కరాన్ని తలపించింది. పెద్ద చెరువు లూటీ పోయిందని తెలువడంతో ఒక్కసారిగా ఎగబడ్డ గ్రామస్తులు… వలలతో చెరువులో దిగిన గ్రామస్తులు లూటీ చేశారు. అయితే అప్పటివరకు ప్రశాంతంగా వున్న పెద్ద చెరువు ఒక్కసారిగా వలలతో, గ్రామస్తులతో నిండిపోయింది.
Read also: Team India Coach: టీమిండియా కోచ్ పదవి.. అతడిని ఒప్పించేందుకు ఎంఎస్ ధోనీ ప్రయత్నాలు!
Also Read
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
చేపలను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ విషయమై కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో పెద్ద చెరువు వద్దకు హుటా హుటిన పోలీసులు చేరుకున్నారు. అక్కడున్న వారిని చెదర గొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులను కూడా లెక్కచేయకుండా చేపల వేటలో గ్రామస్తులు నిమగ్నమయ్యారు. అయితే పెద్ద చెరువు లూఠీ అవడం ఇది మూడో సారిగా కొందరు గ్రామస్థులు చెబుతున్నారు. మృగ శిర కార్తికి ఇక్కడ గ్రామస్థులకు ఈ చెరువుపై హక్కు వుంటుందని తెలిపారు. అందుకే ఇక్కడ గ్రామస్థులు చేపల వేట పడుతున్నారని అన్నారు. గొడవలు జరగలేదని, లూటీ చేయడానికి గ్రామస్థలకు హక్కు ఉంటుందని తెలిపారు. అయితే పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయం కనుగునేందుకు స్థానికులకు ఆరా తీస్తున్నారు.
Read also: Tragedy: భార్య భర్తపై పడిన భారీ వృక్షం.. ఆ తరువాత..
గతంలో కూడా మహబూబాబాద్ జిల్లాలో చెరువు దగ్గరకు వచ్చిన వేలాది గ్రామస్తులు చెరువులో ఉన్న చేపలను పట్టుకుపోయారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా… అక్కడికి తరలివచ్చిన వేలాది గ్రామస్తులు చేపలను పట్టుకోవడానికి చూశారు. దీంతో మత్స్యకారులకు గ్రామస్తులకు ఘర్షన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని శాంతింప చేయాలని చూశారు. పోలీసుల మాటలను గ్రామస్థులు పట్టించుకోకుండా తోసుకుంటూ వెళ్లి చేపలను పట్టుకున్నారు. వేలాదిగా వచ్చిన గ్రామస్తులను పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు.
Travelers to Goa: గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు..?
- Tags
- Fish
- fly
- Mahbubabad
- Nerada
- people
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!