Fraud : అమాయక పనిమనిషికి గాలం.. ఐదు కోట్ల విలువ చేసే భూమి ఐదు లక్షలకు రిజిస్ట్రేషన్..
- అమాయక పనిమనిషికి గాలం
- ఐదు కోట్ల విలువ చేసే భూమి ఐదు లక్షలకు రిజిస్ట్రేషన్...
- కొడుకు తెలియకుండా తల్లితో రిజిస్ట్రేషన్...
- కలెక్టర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే సంపతే అసలు సూత్రధారి
- సర్వే చేస్తుండగా గ్రామస్తులకు తెలిసి నిలదీయగా
- కిరాయి గుండాలతో కొడుకు పై దాడి చేసే ప్రయత్నం...
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ హైదరాబాద్ లింగంపల్లి లోని ఇంట్లో రెండు నెలలుగా ఇంటి పని చేస్తుంది. పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేంతాలలో రెండు ఎకరాల భూమి ఉంది. ఇంటి యజమానులు పద్మమ్మకు మాయ మాటలు కొడుకు సురేష్ కు తెలియకుండానే గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐదు కోట్లకు విలువ చేసే భూమిని 5 లక్షలకే అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి సర్వేనెంబర్ 401 లోని రెండు ఎకరాల భూమి సర్వే చేస్తుండగా కొడుకు తెలుసుకొని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య కు కొడుకు సురేష్ జరిగిన ఉదాంతాన్ని తెలియజేయగా కొడుకుకి తెలియకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొడుకు కబ్జాలో ఉన్న భూమిని మీరు ఎలా తీసుకుంటారు చూద్దామని కొనుగోలు చేసిన వారికి కొడుకు సురేష్ తరపున నిలదీశారు. దీంతో భూమి కొనుగోలు చేసిన పోచమ్మ కుటుంబీకులకు సంబంధించి 20 మంది కిరాయి హైదరాబాద్ సిక్కు గుండాలను పంపించి కొడుకు పై దాడి చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Pakistan: పాకిస్థాన్లో పేలిన కొత్త రకం బాంబు..
Also Read
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
పోలీసులు పోచమ్మ భూమి కొనుగోలు చేసిన వారు పంపించిన కిరాయి గుండాలను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కిరాయి గుండాల వద్ద కత్తులు లాఠీలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోచమ్మ కొడుకు కలెక్టర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ పద్మమ్మ అమాయక కుటుంబీకులను గుర్తించి ఈ మోసానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పెంటయ్య పరిగి ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తహసిల్దార్లు కూడా కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను తెలుసుకున్నాకే రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Depression: యువతను వెంటాడుతున్న డిప్రెషన్.. ఈ సింపుల్ టిప్స్తో మీ మనసుని ప్రశాంతంగా మార్చుకోండి!
-
Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!