Fraud : అమాయక పనిమనిషికి గాలం.. ఐదు కోట్ల విలువ చేసే భూమి ఐదు లక్షలకు రిజిస్ట్రేషన్..
- అమాయక పనిమనిషికి గాలం
- ఐదు కోట్ల విలువ చేసే భూమి ఐదు లక్షలకు రిజిస్ట్రేషన్...
- కొడుకు తెలియకుండా తల్లితో రిజిస్ట్రేషన్...
- కలెక్టర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే సంపతే అసలు సూత్రధారి
- సర్వే చేస్తుండగా గ్రామస్తులకు తెలిసి నిలదీయగా
- కిరాయి గుండాలతో కొడుకు పై దాడి చేసే ప్రయత్నం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ హైదరాబాద్ లింగంపల్లి లోని ఇంట్లో రెండు నెలలుగా ఇంటి పని చేస్తుంది. పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేంతాలలో రెండు ఎకరాల భూమి ఉంది. ఇంటి యజమానులు పద్మమ్మకు మాయ మాటలు కొడుకు సురేష్ కు తెలియకుండానే గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐదు కోట్లకు విలువ చేసే భూమిని 5 లక్షలకే అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి సర్వేనెంబర్ 401 లోని రెండు ఎకరాల భూమి సర్వే చేస్తుండగా కొడుకు తెలుసుకొని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య కు కొడుకు సురేష్ జరిగిన ఉదాంతాన్ని తెలియజేయగా కొడుకుకి తెలియకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొడుకు కబ్జాలో ఉన్న భూమిని మీరు ఎలా తీసుకుంటారు చూద్దామని కొనుగోలు చేసిన వారికి కొడుకు సురేష్ తరపున నిలదీశారు. దీంతో భూమి కొనుగోలు చేసిన పోచమ్మ కుటుంబీకులకు సంబంధించి 20 మంది కిరాయి హైదరాబాద్ సిక్కు గుండాలను పంపించి కొడుకు పై దాడి చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Pakistan: పాకిస్థాన్లో పేలిన కొత్త రకం బాంబు..
Also Read
పోలీసులు పోచమ్మ భూమి కొనుగోలు చేసిన వారు పంపించిన కిరాయి గుండాలను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కిరాయి గుండాల వద్ద కత్తులు లాఠీలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోచమ్మ కొడుకు కలెక్టర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ పద్మమ్మ అమాయక కుటుంబీకులను గుర్తించి ఈ మోసానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పెంటయ్య పరిగి ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తహసిల్దార్లు కూడా కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను తెలుసుకున్నాకే రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!