Fraud : అమాయక పనిమనిషికి గాలం.. ఐదు కోట్ల విలువ చేసే భూమి ఐదు లక్షలకు రిజిస్ట్రేషన్..
- అమాయక పనిమనిషికి గాలం
- ఐదు కోట్ల విలువ చేసే భూమి ఐదు లక్షలకు రిజిస్ట్రేషన్...
- కొడుకు తెలియకుండా తల్లితో రిజిస్ట్రేషన్...
- కలెక్టర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే సంపతే అసలు సూత్రధారి
- సర్వే చేస్తుండగా గ్రామస్తులకు తెలిసి నిలదీయగా
- కిరాయి గుండాలతో కొడుకు పై దాడి చేసే ప్రయత్నం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ హైదరాబాద్ లింగంపల్లి లోని ఇంట్లో రెండు నెలలుగా ఇంటి పని చేస్తుంది. పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేంతాలలో రెండు ఎకరాల భూమి ఉంది. ఇంటి యజమానులు పద్మమ్మకు మాయ మాటలు కొడుకు సురేష్ కు తెలియకుండానే గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐదు కోట్లకు విలువ చేసే భూమిని 5 లక్షలకే అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి సర్వేనెంబర్ 401 లోని రెండు ఎకరాల భూమి సర్వే చేస్తుండగా కొడుకు తెలుసుకొని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య కు కొడుకు సురేష్ జరిగిన ఉదాంతాన్ని తెలియజేయగా కొడుకుకి తెలియకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొడుకు కబ్జాలో ఉన్న భూమిని మీరు ఎలా తీసుకుంటారు చూద్దామని కొనుగోలు చేసిన వారికి కొడుకు సురేష్ తరపున నిలదీశారు. దీంతో భూమి కొనుగోలు చేసిన పోచమ్మ కుటుంబీకులకు సంబంధించి 20 మంది కిరాయి హైదరాబాద్ సిక్కు గుండాలను పంపించి కొడుకు పై దాడి చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Pakistan: పాకిస్థాన్లో పేలిన కొత్త రకం బాంబు..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
పోలీసులు పోచమ్మ భూమి కొనుగోలు చేసిన వారు పంపించిన కిరాయి గుండాలను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కిరాయి గుండాల వద్ద కత్తులు లాఠీలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోచమ్మ కొడుకు కలెక్టర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ పద్మమ్మ అమాయక కుటుంబీకులను గుర్తించి ఈ మోసానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పెంటయ్య పరిగి ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తహసిల్దార్లు కూడా కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను తెలుసుకున్నాకే రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!