Navy Radar Station: నేడే నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన.. హాజరుకానున్న రాజ్నాథ్ సింగ్, రేవంత్రెడ్డి
- నేడే నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన..
- హాజరుకానున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు సీఎం రేవంత్రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navy Radar Station: ఎట్టకేలకు నేవీ రాడార్ స్టేషన్కు శంకుస్థాపనకు సిద్దమైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్ఎఫ్ నేవీ రాడార్ సెంటర్కు ఇవాళ మధ్యాహ్నం 12.55 గంటలకు శంకుస్థాపన జరగనుంది. భూమిపూజ కోసం పూడూరు మండలం వికారాబాద్ మండలం టేకులబీడు తండా సమీపంలోని శివారు దామగుండం అటవీప్రాంతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. వికారాబాద్ కలెక్టరేట్లో హెలిప్యాడ్ను సిద్ధం చేసి, అక్కడి నుంచి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు. పదేళ్ల క్రితమే రాడార్ సెంటర్ ఏర్పాటు ప్రక్రియను కేంద్రం ప్రారంభించినా.. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పెండింగ్లో పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకానికి పచ్చజెండా ఊపి రాడార్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Read also: Astrology: అక్టోబర్ 15, మంగళవారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు తొలుత రూ.1900 కోట్ల అంచనా వ్యయం కాగా ఆ తర్వాత రూ.2500 కోట్లకు చేరింది. తాజా అంచనాల ప్రకారం.. రూ.3200 కోట్లకు పెరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. 2010-12లో ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభం కాగా, 2015లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంచనాకు వచ్చేసరికి భూముల కేటాయింపులో జాప్యం జరిగింది. ఎట్టకేలకు మార్గం సుగమమైంది. నేవీ రాడార్ స్టేషన్కు శంకుస్థాపన చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వస్తున్నందున నేవీ, మిలటరీ, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కమాండోలతో పాటు కేంద్ర రక్షణ, నేవీ విభాగాలతో వేదిక వద్ద కార్డన్ ఏర్పాటు చేయగా, బయట భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారు. 400 మందికి పైగా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. హాలు ఆవరణలో 500 మంది మాత్రమే కూర్చునేందుకు వీలుగా మరో 200 మందికి వసతి ఉండేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించి తగు సూచనలు చేశారు.
Monkey Viral Video: ‘మామ ఏక్ పెగ్ లా’ అంటూ.. బీరేసిన కోతి!
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!