Vijayashanti: కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పడం హాస్యాస్పదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayashanti Satires On CM KCR Over Telangana State: కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని స్వయంగా గొప్పలు చెప్పుకోవడం కన్నా హస్యాస్పదం మరొకటి లేదని మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఆయన ఎలాంటి దీక్ష చెయ్యలేదన్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఖమ్మంలో కేసీఆర్ జ్యూసులు తాగినప్పుడు.. విద్యార్థులు, ఉద్యమకారులు, ప్రజలు తిరగబడిన విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేదన్నారు. అలాగే నిమ్స్లో దొంగ దీక్ష ముచ్చట కూడా అందరికీ తెలిసిందేనన్నారు. ఢిల్లీలో దీక్ష పేరుతో కేసీఆర్ చేసిన గోల్మాల్ డ్రామాల గురించి టీఆర్ఎస్లో ఉన్న ముఖ్యులందరికీ తెలుసునని చెప్పారు.
తాను చావు నోట్లో తల పెట్టానని, కోమా దాకా వెళ్లొచ్చానని కేసీఆర్ చెప్పినవన్నీ.. అవాస్తవ తుపాకీ రాముడి కథలని ఎద్దేవా చేశారు. ఆ కథలన్నీ విని జనాలు నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ చెప్తోన్న దొంగ దీక్ష కూడా 2009లో చేసిందని.. తెలంగాణ వచ్చింది 2014లో అని ఆమె గుర్తు చేశారు. ఆ తప్పుడు దీక్షకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధమేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ఏమైనా 2009 నుంచి 2014 వరకు దీక్షలో కూర్చున్నాడా? అంటూ ప్రశ్నించారు. మనమంతా అమాయకులుగా ఉంటే.. అలాంటి అబద్ధాలు చెప్పి, పబ్లిక్ నెత్తిన టోపీ పెట్టే సమర్థత ఒక్క తెలంగాణ సీఎం కేసీఆర్కే సొంతమని విజయశాంతి ఆరోపణలు చేశారు.
Also Read
అంతకుముందు ట్విటర్ మాధ్యమంగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో, జీహెచ్ఎంసీ మరోసారి అప్పుల వైపు చూస్తోందని విజయశాంతి ఆరోపించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ రూ.5,275 కోట్ల అప్పులు చేసిందని.. తాజాగా మరిన్ని అప్పులు చేసేందుకు సిద్ధమవుతోందని అన్నారు. నిధులు కేటాయించాలని ఏటా ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ కోరుతున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నిధులు ఇవ్వకపోవడంతో పాటు మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలంటూ.. బల్దియాపై ప్రభుత్వం భారం మోపుతోందన్నారు. జీహెచ్ఎంసీకి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా.. అవి ప్రభుత్వం నుంచి అందకపోవడంతో జీహెచ్ఎంసీ అప్పులు చేసి, పనుల్ని పూర్తి చేస్తోందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!