కుంభకర్ణుడిలా నిద్ర లేచారు…రైతుల ఏడుపులు కనిపించడం లేదా? : విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సమస్యలు కెసిఆర్ కు కనిపించడం లేదా అని నిప్పులు చేరిగారు. “తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారు. మూడు నాలుగు వారాలుగా ధాన్యం అమ్మకాలు లేకపోవడంతో రైతులు కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు అకాలవర్షాలతో రైతులు గజగజలాడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం గారు మాత్రం ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు…. లేవగానే హడావుడిగా గాంధీ, ఎంజీఎం హాస్పిటల్స్ పోయి షో చేసి వచ్చిండ్రు. ఒక్క పైసా ఇయ్యలే, ఒక్క సమస్య తీర్చలే. పైనుంచి హెలికాఫ్టర్లోనే పోయిండ్రు కదా… కింద రైతులు ధాన్యం పోసుకుని, తడిచిన ధాన్యం దగ్గర కూర్చుని ఏడుస్తున్న దృశ్యాలు కనిపించే లేదా? రైతునని చెప్పుకునే సీఎం, వరంగల్కు పోయేటప్పుడో, వచ్చేటప్పుడో రోడ్డు మార్గాన వచ్చి, రైతుల్ని కలిసి ఉంటే తెలిసేది. రైతు ధాన్యం తడిచిపోవడానికి ఈ ప్రభుత్వానిదే బాధ్యత. ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి ఉంటే ఇంతగా ధాన్యం తడిచిపోయేది కాదు. రైతులకు ఎదురవుతున్న సమస్యల్ని చెప్పుకునేందుకు ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. వర్షానికి భయపడి రైతులు అడ్డికి పావు సేరు ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇంకో రెండు వారాల్లో వర్షాకాలం ప్రారంభం కాబోతోంది. ఆ లోగా కల్లాలను ఖాళీ చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతు కష్టాలు వెంటనే పరిష్కారం కావాలన్న ఆకాంక్షతో సోమవారం (24-05-2021వ తేదీ) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు “తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష” చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
Also Read
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
తాజావార్తలు
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
-
Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!