కుంభకర్ణుడిలా నిద్ర లేచారు…రైతుల ఏడుపులు కనిపించడం లేదా? : విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సమస్యలు కెసిఆర్ కు కనిపించడం లేదా అని నిప్పులు చేరిగారు. “తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారు. మూడు నాలుగు వారాలుగా ధాన్యం అమ్మకాలు లేకపోవడంతో రైతులు కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు అకాలవర్షాలతో రైతులు గజగజలాడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం గారు మాత్రం ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు…. లేవగానే హడావుడిగా గాంధీ, ఎంజీఎం హాస్పిటల్స్ పోయి షో చేసి వచ్చిండ్రు. ఒక్క పైసా ఇయ్యలే, ఒక్క సమస్య తీర్చలే. పైనుంచి హెలికాఫ్టర్లోనే పోయిండ్రు కదా… కింద రైతులు ధాన్యం పోసుకుని, తడిచిన ధాన్యం దగ్గర కూర్చుని ఏడుస్తున్న దృశ్యాలు కనిపించే లేదా? రైతునని చెప్పుకునే సీఎం, వరంగల్కు పోయేటప్పుడో, వచ్చేటప్పుడో రోడ్డు మార్గాన వచ్చి, రైతుల్ని కలిసి ఉంటే తెలిసేది. రైతు ధాన్యం తడిచిపోవడానికి ఈ ప్రభుత్వానిదే బాధ్యత. ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి ఉంటే ఇంతగా ధాన్యం తడిచిపోయేది కాదు. రైతులకు ఎదురవుతున్న సమస్యల్ని చెప్పుకునేందుకు ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. వర్షానికి భయపడి రైతులు అడ్డికి పావు సేరు ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇంకో రెండు వారాల్లో వర్షాకాలం ప్రారంభం కాబోతోంది. ఆ లోగా కల్లాలను ఖాళీ చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతు కష్టాలు వెంటనే పరిష్కారం కావాలన్న ఆకాంక్షతో సోమవారం (24-05-2021వ తేదీ) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు “తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష” చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
-
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్తోనే హైప్!
-
Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!