కుంభకర్ణుడిలా నిద్ర లేచారు…రైతుల ఏడుపులు కనిపించడం లేదా? : విజయశాంతి
సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సమస్యలు కెసిఆర్ కు కనిపించడం లేదా అని నిప్పులు చేరిగారు. “తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారు. మూడు నాలుగు వారాలుగా ధాన్యం అమ్మకాలు లేకపోవడంతో రైతులు కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు అకాలవర్షాలతో రైతులు గజగజలాడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం గారు మాత్రం ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు…. లేవగానే హడావుడిగా గాంధీ, ఎంజీఎం హాస్పిటల్స్ పోయి షో చేసి వచ్చిండ్రు. ఒక్క పైసా ఇయ్యలే, ఒక్క సమస్య తీర్చలే. పైనుంచి హెలికాఫ్టర్లోనే పోయిండ్రు కదా… కింద రైతులు ధాన్యం పోసుకుని, తడిచిన ధాన్యం దగ్గర కూర్చుని ఏడుస్తున్న దృశ్యాలు కనిపించే లేదా? రైతునని చెప్పుకునే సీఎం, వరంగల్కు పోయేటప్పుడో, వచ్చేటప్పుడో రోడ్డు మార్గాన వచ్చి, రైతుల్ని కలిసి ఉంటే తెలిసేది. రైతు ధాన్యం తడిచిపోవడానికి ఈ ప్రభుత్వానిదే బాధ్యత. ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి ఉంటే ఇంతగా ధాన్యం తడిచిపోయేది కాదు. రైతులకు ఎదురవుతున్న సమస్యల్ని చెప్పుకునేందుకు ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. వర్షానికి భయపడి రైతులు అడ్డికి పావు సేరు ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇంకో రెండు వారాల్లో వర్షాకాలం ప్రారంభం కాబోతోంది. ఆ లోగా కల్లాలను ఖాళీ చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతు కష్టాలు వెంటనే పరిష్కారం కావాలన్న ఆకాంక్షతో సోమవారం (24-05-2021వ తేదీ) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు “తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష” చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
Also Read
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
- KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
- DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
తాజావార్తలు
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!