Vemulawada : వేములవాడ రాజన్న దర్శనం రద్దు..
- వేములవాడ రాజన్న ఆలయం మూసివేత
- భక్తులలో నిరాశ.. ఆగ్రహం
- విస్తరణ పనులు వేగంగా
- దర్శనాలపై అయోమయం
Vemulawada : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుతం అభివృద్ధి పనులు, ఆలయ విస్తరణ కారణంగా తాత్కాలికంగా దర్శనాలను రద్దు చేసింది. అయితే, కార్తీక మాసంలో రాజన్న దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ప్రధాన ఆలయం మూసివేయడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులను భక్తులు స్వాగతిస్తున్నప్పటికీ, ముందస్తు సమాచారం లేకుండానే బుధవారం (నవంబర్ 11) ఉదయం నుంచి దర్శనాలను నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆలయాన్ని ఎన్ని రోజుల పాటు మూసివేస్తారనే విషయంలో అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం భక్తులలో తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తోంది. గతంలోనూ ఆలయాన్ని మూసివేసినప్పుడు ఇలాంటి గందరగోళమే తలెత్తి, బీజేపీ సహా హిందూ సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం 20 గుంటల్లో ఉన్న రాజన్న ఆలయాన్ని విస్తరణలో భాగంగా 4 ఎకరాల 2 గుంటలకు పెంచనున్నారు. ఈ విస్తరణ పనుల కారణంగానే ప్రధాన ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి.
Also Read
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అయితే, ఆలయాన్ని మూసివేస్తే కచ్చితమైన ప్రకటన ఇవ్వాలని, ఎన్ని రోజుల పాటు దర్శనాలు నిలిపివేస్తారో స్పష్టం చేయాలని భక్తులు, హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. “ఆలయాన్ని మూసివేయలేదు, పూజలు యథావిధిగా జరుగుతున్నాయి. అత్యవసరం ఉన్నప్పుడే దర్శనాలు నిలిపివేస్తున్నాం” అని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ ప్రకటనతో భక్తులు సంతృప్తి చెందడం లేదు. అకస్మాత్తుగా ఆలయం మూసివేయడంతో, రాజన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరగకుండా.. భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు.
కోడె మొక్కులు, కుంకుమ పూజలు, అభిషేకాల వంటి సేవలను కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి, ప్రధాన ఆలయంలో స్వామివారి రథాన్ని ప్రదర్శించి, గర్భగుడిలో జరుగుతున్న పూజలను భక్తులు చూసేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రధాన ఆలయానికి తాళాలు వేసి, అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా ఆలయాన్ని మూసివేసినట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పటికీ… భక్తులు మాత్రం శివరాత్రి వరకు ప్రధాన ఆలయంలో దర్శనానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Maharashtra: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలను ఢీకొన్న ట్రక్కు.. 8 మంది సజీవ దహనం
తాజావార్తలు
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?