Basara Temple: బాసర అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswathi Temple Basara: చదువుల తల్లి సరస్వతి సకల లోకాలకు జ్ఞాన ప్రదాత. ఈ దేవిని కొలిస్తే సిద్ధి బుద్ధి కలుగుతుంది. అలాంటి అమ్మవారి జన్మదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునేవారు వసంత పంచమి. ఈ సందర్భంగా దేశంలో ఎంతో పేరు తెచ్చుకున్న చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విద్య, సంగీత, కళలకు అధిదేవత అయిన సరస్వతీ దేవి జన్మదినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్రమైన రోజున, భక్తులు తమ పిల్లలకు అక్షరాస్యత నేర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంతపంచమి నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా మంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించి ఆశీస్సులు అందజేశారు.
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత పంచమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వసంత పంచమి రోజు పిల్లలు అక్షరాభ్యాసం చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also:Maharashtra: లిఫ్ట్ ఇస్తామని చెప్పి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..
ఈ నేపథ్యంలో ఆలయ పండితులు తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచి అక్షరాస్యత పాఠాలు కొనసాగుతున్నాయి. బాసర ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ గోపురాలు తదితర ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో ఆలయం కళకళలాడింది. పలువురు భక్తులు వేకువజామునే చేరుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రించారు. ఇక ఉదయం గోదావరిలో పుణ్య స్నానా లు ఆచరించి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Kanha Music Fest: కన్హా శాంతి వనంలో మ్యూజిక్ ఫెస్టివల్.. సంగీతంతో అలరించనున్న ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్
తాజావార్తలు
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!