Basara Temple: బాసర అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswathi Temple Basara: చదువుల తల్లి సరస్వతి సకల లోకాలకు జ్ఞాన ప్రదాత. ఈ దేవిని కొలిస్తే సిద్ధి బుద్ధి కలుగుతుంది. అలాంటి అమ్మవారి జన్మదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునేవారు వసంత పంచమి. ఈ సందర్భంగా దేశంలో ఎంతో పేరు తెచ్చుకున్న చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విద్య, సంగీత, కళలకు అధిదేవత అయిన సరస్వతీ దేవి జన్మదినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్రమైన రోజున, భక్తులు తమ పిల్లలకు అక్షరాస్యత నేర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంతపంచమి నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా మంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించి ఆశీస్సులు అందజేశారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత పంచమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వసంత పంచమి రోజు పిల్లలు అక్షరాభ్యాసం చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also:Maharashtra: లిఫ్ట్ ఇస్తామని చెప్పి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..
ఈ నేపథ్యంలో ఆలయ పండితులు తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచి అక్షరాస్యత పాఠాలు కొనసాగుతున్నాయి. బాసర ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ గోపురాలు తదితర ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో ఆలయం కళకళలాడింది. పలువురు భక్తులు వేకువజామునే చేరుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రించారు. ఇక ఉదయం గోదావరిలో పుణ్య స్నానా లు ఆచరించి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Kanha Music Fest: కన్హా శాంతి వనంలో మ్యూజిక్ ఫెస్టివల్.. సంగీతంతో అలరించనున్న ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్
తాజావార్తలు
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!