Basara Temple: బాసర అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswathi Temple Basara: చదువుల తల్లి సరస్వతి సకల లోకాలకు జ్ఞాన ప్రదాత. ఈ దేవిని కొలిస్తే సిద్ధి బుద్ధి కలుగుతుంది. అలాంటి అమ్మవారి జన్మదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునేవారు వసంత పంచమి. ఈ సందర్భంగా దేశంలో ఎంతో పేరు తెచ్చుకున్న చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విద్య, సంగీత, కళలకు అధిదేవత అయిన సరస్వతీ దేవి జన్మదినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్రమైన రోజున, భక్తులు తమ పిల్లలకు అక్షరాస్యత నేర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంతపంచమి నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా మంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించి ఆశీస్సులు అందజేశారు.
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత పంచమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వసంత పంచమి రోజు పిల్లలు అక్షరాభ్యాసం చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also:Maharashtra: లిఫ్ట్ ఇస్తామని చెప్పి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..
ఈ నేపథ్యంలో ఆలయ పండితులు తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచి అక్షరాస్యత పాఠాలు కొనసాగుతున్నాయి. బాసర ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ గోపురాలు తదితర ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో ఆలయం కళకళలాడింది. పలువురు భక్తులు వేకువజామునే చేరుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రించారు. ఇక ఉదయం గోదావరిలో పుణ్య స్నానా లు ఆచరించి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Kanha Music Fest: కన్హా శాంతి వనంలో మ్యూజిక్ ఫెస్టివల్.. సంగీతంతో అలరించనున్న ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్
తాజావార్తలు
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!