Basara Temple: బాసర అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswathi Temple Basara: చదువుల తల్లి సరస్వతి సకల లోకాలకు జ్ఞాన ప్రదాత. ఈ దేవిని కొలిస్తే సిద్ధి బుద్ధి కలుగుతుంది. అలాంటి అమ్మవారి జన్మదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునేవారు వసంత పంచమి. ఈ సందర్భంగా దేశంలో ఎంతో పేరు తెచ్చుకున్న చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విద్య, సంగీత, కళలకు అధిదేవత అయిన సరస్వతీ దేవి జన్మదినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్రమైన రోజున, భక్తులు తమ పిల్లలకు అక్షరాస్యత నేర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంతపంచమి నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా మంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించి ఆశీస్సులు అందజేశారు.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత పంచమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వసంత పంచమి రోజు పిల్లలు అక్షరాభ్యాసం చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also:Maharashtra: లిఫ్ట్ ఇస్తామని చెప్పి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..
ఈ నేపథ్యంలో ఆలయ పండితులు తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచి అక్షరాస్యత పాఠాలు కొనసాగుతున్నాయి. బాసర ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ గోపురాలు తదితర ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో ఆలయం కళకళలాడింది. పలువురు భక్తులు వేకువజామునే చేరుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రించారు. ఇక ఉదయం గోదావరిలో పుణ్య స్నానా లు ఆచరించి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Kanha Music Fest: కన్హా శాంతి వనంలో మ్యూజిక్ ఫెస్టివల్.. సంగీతంతో అలరించనున్న ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!