Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
- ఎల్నీనోపై ఉన్నతస్థాయి సమీక్ష
- జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ
- సాగునీరు, ఎరువులపై కీలక ఆదేశాలు
- వదంతులు నమ్మొద్దని రైతులకు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : రాష్ట్రంలో ఎల్నీనో ప్రభావం, వర్షపాత పరిస్థితులపై రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వి.సి జానయ్యతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్నీనో సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.
జిల్లా వారీగా కార్యాచరణ.. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
ఎల్నీనో ప్రభావానికి అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణం, వ్యవసాయం, నీటిపారుదల శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. జిల్లాల్లో వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి లభ్యత ఆధారంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామసభల ద్వారా రైతుల్లో ఎల్నీనో ప్రభావంపై చైతన్యం తీసుకురావాలని, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ నీటితో పండే పంటల ఎంపికపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు , సాంకేతిక సలహాలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
సాగునీటి శాస్త్రీయ నిర్వహణ.. ఎరువుల లభ్యతపై ఆదేశాలు
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ఉన్న నీటి లభ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న సాగునీటిని వృధా కాకుండా అత్యంత శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి పంటలకు అందిస్తామన్నారు. సాగు సీజన్కు అవసరమైన ఎరువులను రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొన్నారు.
వదంతులు నమ్మవద్దు.. రైతు సంక్షేమమే అత్యున్నత ప్రాధాన్యం
రైతు సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగు విషయాలపై సోషల్ మీడియాలో లేదా బయట వచ్చే ఎలాంటి వదంతులను, పుకార్లను రైతులు నమ్మవద్దని.. కేవలం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఇచ్చే అధికారిక సూచనలనే పాటించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ రైతులకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!