NTV Telugu Site icon

మోడీ, షాకు ధన్యవాదాలు.. నా ముందు ఆ రెండు వ్యూహాలే..!

Union Minister Kishan Reddy

Union Minister Kishan Reddy

కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ప్రమోషన్‌ అందుకున్న జి కిషన్‌ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు.. నాపై విశ్వాసం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తానన్న ఆయన.. నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన అమిత్ షాకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అమిత్ షా శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను.. వారికి కృతజ్ఞుడనై ఉంటానని..బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. నవభారత నిర్మాణం కోసం నరేంద్ర మోడీ స్వప్నం సాకారాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ అమరవీరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతానికి నా ముందున్నాయని.. నన్ను ఆదరించి పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని తన ప్రకటనలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.