Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మృతి.. కొమురం భీంలో ఒకరు, మంచిర్యాలలో మరొకరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మరణించిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండ తీవ్రత అధికమయింది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో వడదెబ్బ మృత్యువాత పడుతున్నవారు కూడా ఎక్కువవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
కొమురం భీం జిల్లాలో ఒకరు మృతి చెందగా.. మంచిర్యాల జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారమ్.2 లో వడదెబ్బతో గుర్తుతెలియని వృద్దుడు మృతి. మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణం వినాయక్ నగర్ కు చెందిన మేడిశెట్టి మహేష్ అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read
Read also: Road Accident: బర్త్డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం.. స్పాట్లోనే నలుగురు యువకులు మృతి
వడదెబ్బకు తాజాగా ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీహార్కు చెందిన ఓ కూలీ, నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేట్ టీచర్ మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బీహార్ కు చెందిన శంకర్ సదా అనే కూలీ పనిచేస్తున్నాడు. శుక్రవారం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి తెలిపారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం లాం అడ్లూరు గ్రామానికి చెందిన బోడ అశ్రిత నకిరేకల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇటీవల బంధువు ఓ ఫంక్షన్కు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందారు. ఓ ఫంక్షన్కు వెళ్లిన తన భార్య వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయిందని అశ్రిత భర్త పేర్కొన్నాడు.
Road Accident: బర్త్డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం.. స్పాట్లోనే నలుగురు యువకులు మృతి
తాజావార్తలు
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!