Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tummidihetti Project Revival Jupally Krishnarao Brs Criticism

Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం

Published Date :May 8, 2026 , 12:12 pm
By Gogikar Sai Krishna
  • తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెడతాం: జూపల్లి
  • కాళేశ్వరం వల్లే రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం: మంత్రి విమర్శలు
  • మహారాష్ట్రతో చర్చించి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
  • బీజేపీ ఎంపీలు ప్రధాని వద్ద ప్రాజెక్టు అంశం ప్రస్తావించాలి
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

upally Krishna Rao : కొమురం భీం జిల్లా పర్యటనలో ఉన్న ఎక్సైజ్ , పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సాగునీటి రంగంలో గ్రావిటీ ద్వారా నీటిని అందించే గొప్ప అవకాశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని ఆయన విమర్శించారు.

మంత్రి జూపల్లి మాట్లాడుతూ, “2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. డా. బీఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు (తుమ్మిడిహెట్టి బరాజ్) భూమిపూజ చేశారు. రూ. 38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. 106 కిలోమీటర్ల కాలువ పనులకు గానూ ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయ్యి, 46 కిలోమీటర్ల మేర పనులు కూడా జరిగాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆర్థిక భారం మోపింది” అని మండిపడ్డారు.

Also Read

  • Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • CM Revanth Reddy : నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Add as a preferred
source on google

గ్రావిటీ (సహజ సిద్ధమైన ప్రవాహం) ద్వారా వెళ్లాల్సిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడం వల్ల అంచనా వ్యయం గణనీయంగా పెరిగిందని మంత్రి వివరించారు. దీనివల్ల రాష్ట్రంపై భారీగా ఆర్థిక భారం పడటమే కాకుండా, కరెంట్ బిల్లులు కూడా భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నది తలాపునే ఉన్న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రస్తుతం ఆ నీటిని వినియోగించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కృత నిశ్చయంతో ఉందని జూపల్లి తెలిపారు. “150 మీటర్ల బరాజ్ నిర్మాణానికి అంగీకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. దీనివల్ల మహారాష్ట్రలోని శివిని గ్రామానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదు. భూములు నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాల్లోనూ భూగర్భ జలాలు పెరుగుతాయి. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కృషి చేయాలి” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, వికసిత్ భారత్ అని చెప్పుకునే కేంద్రం ఈ ప్రాజెక్టు విషయంలో పెద్ద మనసు చాటుకోవాలని కోరారు. బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఒక్క యూనిట్ కరెంటు కూడా ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని తరలించే ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తామని, ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు మానుకుని సహకరించాలని మంత్రి జూపల్లి కోరారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • Congress government
  • Jupally Krishna Rao
  • Kaleshwaram project
  • revanth reddy

తాజావార్తలు

  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం

  • LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..

  • Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!

  • Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • OnePlus Nord CE 6 Lite: వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions