CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- తుమ్మిడిహెట్టి అంశంపై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
- ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఫోకస్
- బ్యారేజ్ ఎత్తు పెంపుతో లక్షల ఎకరాలకు సాగునీరు?
- గ్రావిటీ ద్వారా నీటి తరలింపుపై తెలంగాణ లెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ‘తుమ్మిడిహెట్టి బ్యారేజ్’ నిర్మాణం , దాని ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారికంగా ఒక లేఖ రాశారు. ఈ బ్యారేజ్ అంశంపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రతినిధుల బృందంతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అందుకు అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆ లేఖలో కోరారు.
గతంలో (2016 ఆగస్టు 23న) జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు (Inter-State Board) సమావేశంలో తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో (FRL) బ్యారేజ్ నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అవసరమైన అన్ని అనుమతులకు సహకరిస్తామని కూడా అప్పట్లో తెలిపింది. అయితే, నిలిచిపోయిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్.. ఇటీవల ఈ ప్రాజెక్టుపై సమగ్రంగా పునఃసమీక్ష నిర్వహించింది.
Also Read
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
ఎత్తు పెంచితేనే తెలంగాణకు ప్రయోజనం.. ముంపు చాలా తక్కువ!
ఇంజనీరింగ్ నిపుణుల సూచనల ప్రకారం.. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల నీటి అవసరాలను పూర్తిగా తీర్చడం సాధ్యం కాదని రేవంత్ సర్కార్ ఒక అంచనాకు వచ్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలోని లక్షలాది ఎకరాల సాగునీటి అవసరాలను, ప్రజల తాగునీటి గోసను తీర్చాలంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్రతో మరోసారి చర్చలు జరపడం అనివార్యమని సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు.
ఒకవేళ బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల కంటే కాస్త పెంచినప్పటికీ, మహారాష్ట్ర వైపు జరిగే ముంపు ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని రేవంత్ రెడ్డి ఆ లేఖలో సాంకేతికంగా వివరించారు. ఎఫ్ఆర్ఎల్ (FRL) ఎత్తును పెంచడం ద్వారా అదనపు పంపింగ్ ఖర్చులు లేకుండా, కేవలం గ్రావిటీ (సహజ ప్రవాహం) ద్వారానే తెలంగాణలోని బీడు భూములకు సులభంగా నీటిని తరలించే వీలుంటుందని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..