Tummala Nageswara Rao: హైదరాబాద్ నుంచి ఖమ్మంకు తుమ్మల.. అనుచరులతో సమావేశమయ్యే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వరరావు భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. ఖమ్మం వస్తున్న తమ నేతకు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు. 2 వేల కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఖమ్మంలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. తుమ్మల పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన.. కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ ప్రకటించారు. దీంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల.. ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావులను శాంతింపజేసేందుకు హైదరాబాద్లోని తుమ్మల ఇంటికి పంపారు. ఇరువురు నేతలు తుమ్మలతో సమావేశమై చర్చించారు. అయితే తుమ్మల మాత్రం ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Read also: Uttam Kumar: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతోంది.. ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
పాలేరు నుంచి తమ నేతకే టికెట్ వస్తుందని భావించినట్లు నాగేశ్వరరావు బంధువులు చెబుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983 ఎన్నికల్లో ఓడిపోయారు. 1985, 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలుపొందారు. విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి తుమ్మల పాలేరు నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి మృతితో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో తుమ్మల పాలేరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. కానీ కేసీఆర్ తుమ్మలకు బదులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో తుమ్మల భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
Uttam Kumar: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతోంది.. ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
-
CM Vijay: “1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు”.. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
-
Upcoming Royal Enfield Bikes 2026: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3 కొత్త బైక్స్.. హిమాలయన్ 440, 750, GT 750 వచ్చేస్తున్నాయ్!
-
US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!