Education Policy 2020: తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని, మన ఊరు – మన బడి ని సమర్థవంతంగా అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్ చేసింది. దేశంలో విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, రాష్ట్రాల హక్కులు హరించి విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచేది, లౌకిక తత్వానికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్రంలో అమలు జరపకుండా తిరస్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశం డిమాండ్ చేసింది.
ఫిబ్రవరి 27,28 తేదీల్లో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు నాగర్ కర్నూలులో జరిగాయి. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి హైదరాబాద్ లో తీర్మానాలను పత్రికలకు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి సమాంతరంగా ఇంగ్లీషు మీడియం ప్రారంభించాలనే నిర్ణయాన్ని టిఎస్ యుటిఎఫ్ స్వాగతించింది. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 21,500 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇంగ్లీషు మీడియం కోసం అదనంగా అవసరమైన ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు చేపట్టాలని కోరింది. పాఠశాల విద్యలో కీలకమైన పర్యవేక్షణాధికారుల ఖాళీలు భర్తీ చేయాలని, అన్ని జిల్లాలకు రెగ్యులర్ డిఈఓ లను, నియోజకవర్గానికి ఒక డిప్యూటీ ఇఓ, ప్రతి మండలానికి ఒక ఎంఈఓ పోస్టును మంజూరు చేసి భర్తీ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
గత ఏడేండ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు, నాలుగేళ్ళుగా జరగని సాధారణ బదిలీలకు వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని, జిఓ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సివిల్ సర్వీసు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు శాపంగా మారాయి. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని సమావేశం తీర్మానించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పటిష్టపరచాలని, అన్ని ప్రభుత్వ శాఖలలోని రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం ప్రభుత్వ బాధ్యతగా అందజేయాలని, అవసరమైతే ప్రభుత్వ వైద్యశాలలనే కార్పోరేట్ స్థాయికి అభివృద్ధి చేసి ప్రజలందరితో పాటు ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలి.
ఉద్యోగులనుండి 1% లేదా 2% చందా వసూలు చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. గురుకుల పాఠశాలల్లో పనిభారాన్ని తగ్గించాలి. ఈ సమావేశంలో కె జంగయ్య, సిహెచ్ దుర్గాభవాని, సిహెచ్ రాములు, ఎమ్మెల్సీ ఎ నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు, 33 జిల్లాల నుండి 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!