Sajjanar: ఓ యువకుడి నిర్లక్ష్యం.. తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjanar: హైదరాబాద్ శివార్లలోని సన్ సిటీ సమీపంలో మంగళవారం జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరమని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. హైదరాబాద్ శివారులోని సన్ సిటీ సమీపంలో నిన్న జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. ఓ యువకుడి అజాగ్రత్త, మితిమీరిన వేగం.. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఓ అమాయక తల్లీకూతుళ్లను బలిగొంది. మరో ఇద్దరు గాయపడ్డారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి మరీ ప్రేమతో రోడ్లపైకి పంపితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అంటూ ట్వీట్ చేశాడు.
Read also: Astrology: జూలై 06, గురువారం దినఫలాలు
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
హైదరాబాద్ శివారులోని బండ్లగూడలో మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిలోని ఆర్మీ స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద మార్నింగ్ వాక్ కు వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను కారు ఢీకొట్టింది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్లు అనురాధ , మమత మృతి చెందగా.. మరో మహిళ కవితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సీఎన్టీ కాలనీకి చెందిన ఇంతియాజ్ ఆలం ఖాన్ను కూడా కారు ఢీకొట్టింది. కవిత, అలంఖాన్లను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కవిత అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదానికి 19 ఏళ్ల బద్రుద్దీన్ ఖాదిరీ కారణమని పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన బద్రుద్దీన్ ఖాదిరీకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన బద్రిద్దీన్ పుట్టినరోజు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. పుట్టిన రోజు వేడుకల కోసం కారులో బయల్దేరిన సంగతి తెలిసిందే.
Minister KTR: నేడు సిరిసిల్లకు కేటీఆర్..1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!