TSRTC: ప్రయాణికులపై మరో పిడుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దిక్కుతోచకుండా వున్న ప్రయాణికులపై మరో భారం మోపింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. ఒకటికాదు ఏకంగా రెండుసార్లు టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ధరలను కూడా బాగా సవరించింది. దీంతో 30 శాతం వరకూ బస్ పాస్ ఛార్జీలు పెరిగాయి. తాజాగా ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ పిడుగు వేసింది. రిజర్వేషన్ ఛార్జీలు పెంచేసింది. పెంచిన రిజర్వేషన్ ఛార్జీలపై ఇప్పటి వరకు అధికార ప్రకటన చేయలేదు ఆర్టీసీ. గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో రిజర్వేషన్ పై 20 రూపాయల నుండి 30 రూపాయలకు పెంచింది టీఎస్ ఆర్టీసీ. ఈ పెంచిన ఛార్జీలు వెంటనే అమలులోకి రానున్నాయి. దీంతో టికెట్ ఛార్జీలు మరింత భారం అవుతాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
Also Read
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఇప్పటికే టికెట్ ఛార్జీలు పెరిగిన ప్రయాణం భారంగా మారిందని, మళ్ళీ రిజర్వేషన్ ఛార్జీలు పెంచి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా మార్చారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇది చాలదన్నట్టు త్వరలో మరో సారి ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయని ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించడంపై మరింత ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రోడ్డుమీదకు వచ్చి బస్ ఎక్కాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయని సామాన్య ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న దూరాలకు కూడా టికెట్ ధరలు భారంగా మారాయంటున్నారు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!