Site icon NTV Telugu

గుడ్‌న్యూస్‌.. ఎలక్ట్రిక్‌ వాహనాలకు సర్కార్‌ సబ్సిడీ

ఇంధనంతో నడిచే వాహనాలు కాలుష్యానికి కారణం అవుతున్నాయి.. రోజురోజుకీ పెరిగిపోతున్న వాహనాలు.. క్రమంగా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.. దీంతో, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతున్నారు.. అందులో భాగంగా ఇప్పటికే రకరకాల ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి.. భవిష్యత్‌లో వాహనరంగంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు కీలక భూమిక పోషించనున్నాయి.. ఇక, ఆ వాహనాలను కొనుగోలు చేసేవారికి శుభవార్త వినిపించింది తెలంగాణ ప్రభుత్వం.. ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని ఇవ్వనున్నట్టు వెల్లడించింది.. ఈ విషయాన్ని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్‌కో) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.జానయ్య తెలిపారు..

Read Also: ఫిర్యాదులలో ఎయిర్‌టెల్‌ రికార్డు..! ఏంటిది..?

టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్‌ వీలర్‌ ఇలా తేడా లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుందన్న ఆయన.. రూ.10 లక్షల విలువైన వాహనాల వరకూ ఈ సబ్సిడీ ఉంటుందని వెల్లడించారు. మరోవైపు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ‘గో ఎలక్ట్రిక్‌’పేరుతో రోడ్‌ షో నిర్వహించనున్నామని తెలిపారు జానయ్య.. రూ.50 వేల నుంచి రూ.30 లక్షల విలువ చేసే అన్ని రకాల వాహనాలను ఈ రోడ్‌ షోలో ప్రదర్శనకు ఉంచుతామని.. 60 స్టాల్స్, చార్జింగ్‌ పాయింట్లు ప్రదర్శనకు ఉంటాయని వెల్లడించారు..

Exit mobile version