TSPSC Group-1: గ్రూప్-1 భర్తీకి లైన్క్లియర్.. త్వరలోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Group-1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా గత ప్రభుత్వం ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేదు. ఈ క్రమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులతో కొత్తగా ఏర్పడిన చైర్మన్, సభ్యులు గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.
Read also: Rozgar Mela: నేడు లక్ష మందికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ
Also Read
సర్కార్ గ్రూప్-1 పోస్టులను పెంచింది..
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన 503 గ్రూప్ -1 నోటిఫికేషన్ తో పాటు మరో 60 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులతో పాటు ఈ 60 పోస్టులను కలిపి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్ పీఎస్సీని ప్రభుత్వం ఆదేశించింది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది జూన్ 11న టీఎస్ పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను కోర్టు రద్దు చేసింది. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా 60 కొత్త పోస్టులు మంజూరు కావడంతో గ్రూప్-1 ప్రిలిమినరీ మళ్లీ నిర్వహించే అవకాశం ఉంది.
Read also: Qatar-India: గూఢచర్యం ఆరోపణలు.. 8 మంది భారతీయులను విడుదల చేసిన ఖతార్ ప్రభుత్వం!
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండేళ్ల కిందటే తొలిసారిగా అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించారు. అనంతరం ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో కమిషన్ పరీక్షను రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది మళ్లీ జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా.. వారిలో 25 వేల మందిని 1:50 నిష్పత్తిలో టీఎస్పీఎస్సీ ఈ ఏడాది జనవరిలో మెయిన్స్కు ఎంపిక చేసింది. జూన్లో మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో అనూహ్యంగా కమిషన్ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఉపసంహరించుకుంటున్నట్లు కమిషన్ తాజాగా దావా వేసింది. దీంతో గ్రూప్ 1 నోటిఫికేషన్కు లైన్ విడుదలై పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 46 ఏళ్ల వరకు సడలిస్తామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Medaram Traffic: మేడారంలో ట్రాఫిక్ కష్టాలు.. జాతర స్టార్ట్ అయితే పరిస్థితేంటి..?
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!