TS SSC Results: నేడే టెన్త్ ఫలితాలు.. సమయం ఇదే..
సుమారు 5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను అధికారులు నేడు విడుదల చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ విద్యాశాఖ. టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం bse.telangana.gov.in, bseresults.telangana.gov.in విద్యార్థులు తదితర వెబ్సైట్ల ద్వారా తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
గత రేండేళ్లుగా రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే.. పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్థులకు ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులను కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి వైరస్ ప్రభావం తగ్గడంతో పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసి, కరోనా నిబంధనలతో టెన్త్ పరీక్షలను నిర్వహించారు. కాగా.. స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభమవడం.. పూర్తి స్థాయిలో క్లాసులు జరగకపోవడంతో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తం అవుతోంది.
Also Read
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
అయితే.. తెలంగాణలో నిర్వహించిన టెన్త్ ఎగ్జామ్స్ కు సుమారు 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదోతరగతి ఎగ్జామ్స్ కు సంబంధించి గతంలో 11 పేపర్లతో పరీక్ష నిర్వహించారు. కాగా.. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కేవలం 6 పేపర్లకే ఎగ్జామ్ అధికారులు నిర్వహించారు. పాఠ్యాంశాన్ని సైతం 30 శాతానికి తగ్గించారు. పిల్లలకు ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ. అయితే.. ఇప్పటికే ఏపీలో టెన్త్ ఫలితాలను విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. కాగా.. కేవలం 67 శాతం మాత్రమే పాస్ పర్సంటేజ్ నమోదు కావడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణంమంటూ మండిపడ్డాయి. కాగా.. కరోనా పరిస్థితుల కారణంగానే పాస్ పర్సంటేజ్ నమోదైందని అధికార పార్టీ చెబుతోంది.
Maharashtra Political Crisis: ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫడ్నవీస్.
తాజావార్తలు
-
Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం – 3.. రిలీజ్ డౌట్?
-
Depression: యువతను వెంటాడుతున్న డిప్రెషన్.. ఈ సింపుల్ టిప్స్తో మీ మనసుని ప్రశాంతంగా మార్చుకోండి!
-
Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!