TS SSC Results: నేడే టెన్త్ ఫలితాలు.. సమయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమారు 5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను అధికారులు నేడు విడుదల చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ విద్యాశాఖ. టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం bse.telangana.gov.in, bseresults.telangana.gov.in విద్యార్థులు తదితర వెబ్సైట్ల ద్వారా తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
గత రేండేళ్లుగా రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే.. పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్థులకు ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులను కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి వైరస్ ప్రభావం తగ్గడంతో పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసి, కరోనా నిబంధనలతో టెన్త్ పరీక్షలను నిర్వహించారు. కాగా.. స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభమవడం.. పూర్తి స్థాయిలో క్లాసులు జరగకపోవడంతో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తం అవుతోంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
అయితే.. తెలంగాణలో నిర్వహించిన టెన్త్ ఎగ్జామ్స్ కు సుమారు 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదోతరగతి ఎగ్జామ్స్ కు సంబంధించి గతంలో 11 పేపర్లతో పరీక్ష నిర్వహించారు. కాగా.. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కేవలం 6 పేపర్లకే ఎగ్జామ్ అధికారులు నిర్వహించారు. పాఠ్యాంశాన్ని సైతం 30 శాతానికి తగ్గించారు. పిల్లలకు ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ. అయితే.. ఇప్పటికే ఏపీలో టెన్త్ ఫలితాలను విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. కాగా.. కేవలం 67 శాతం మాత్రమే పాస్ పర్సంటేజ్ నమోదు కావడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణంమంటూ మండిపడ్డాయి. కాగా.. కరోనా పరిస్థితుల కారణంగానే పాస్ పర్సంటేజ్ నమోదైందని అధికార పార్టీ చెబుతోంది.
Maharashtra Political Crisis: ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫడ్నవీస్.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!