Telangana : ‘ట్రంప్ అవెన్యూ’పై రగడ.. రేవంత్ సర్కార్కు లెఫ్ట్ వార్నింగ్.!
- ‘ట్రంప్ అవెన్యూ’ పేరుపై లెఫ్ట్ అభ్యంతరం
- కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలు
- 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలు
- నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ఉన్న ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. సదరు రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వామపక్ష (లెఫ్ట్) పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని లెఫ్ట్ పార్టీల ఉమ్మడి సమావేశం డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ‘ఎంబి భవన్’లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అధ్యక్షతన వామపక్ష పార్టీల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యాచరణను లెఫ్ట్ పార్టీలు అధికారికంగా ప్రకటించాయి.
సామ్రాజ్యవాదానికి వత్తాసు.. కాంగ్రెస్ తీరుపై ఆక్షేపణ
ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి ప్రజల మీద యుద్ధాలను రుద్దుతోందని, ప్రపంచ ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తోందని వామపక్ష నాయకులు ఈ సమావేశంలో ధ్వజమెత్తారు. గతంలో మనదేశం మీద ట్రంప్ విధించిన ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా చిన్నాభిన్నం చేశాయని వారు గుర్తుచేశారు. ఇందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారం కూడా తోడవటంతో దేశం మరింత నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ, ఇక్కడి పాలకులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ బాటలోనే నిర్ణయాలు తీసుకోవడం అత్యంత ఆక్షేపణీయమని లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. ఈ వివాదాస్పద చర్యపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తక్షణమే స్పందించి, జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
రాష్ట్రవ్యాప్త నిరసనలు.. రెండు రోజుల కార్యాచరణ
రేవంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీల సమావేశం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన ఉదయం 10:30 గంటలకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వివిధ రంగాల మేధావులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత 21వ తేదీన నగరంలోని బాబూ జగ్జీవన్రాం విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వామపక్ష శ్రేణులతో భారీ నిరసన ప్రదర్శన జరపాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదిత నిరసన కార్యక్రమాల్లో అన్ని వామపక్ష పార్టీల అగ్రనేతలు, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనున్నట్లు లెఫ్ట్ పార్టీల ఉమ్మడి వేదిక ప్రకటించింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!