Telangana : ‘ట్రంప్ అవెన్యూ’పై రగడ.. రేవంత్ సర్కార్కు లెఫ్ట్ వార్నింగ్.!
- ‘ట్రంప్ అవెన్యూ’ పేరుపై లెఫ్ట్ అభ్యంతరం
- కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలు
- 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలు
- నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ఉన్న ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. సదరు రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వామపక్ష (లెఫ్ట్) పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని లెఫ్ట్ పార్టీల ఉమ్మడి సమావేశం డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ‘ఎంబి భవన్’లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అధ్యక్షతన వామపక్ష పార్టీల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యాచరణను లెఫ్ట్ పార్టీలు అధికారికంగా ప్రకటించాయి.
సామ్రాజ్యవాదానికి వత్తాసు.. కాంగ్రెస్ తీరుపై ఆక్షేపణ
ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి ప్రజల మీద యుద్ధాలను రుద్దుతోందని, ప్రపంచ ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తోందని వామపక్ష నాయకులు ఈ సమావేశంలో ధ్వజమెత్తారు. గతంలో మనదేశం మీద ట్రంప్ విధించిన ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా చిన్నాభిన్నం చేశాయని వారు గుర్తుచేశారు. ఇందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారం కూడా తోడవటంతో దేశం మరింత నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ, ఇక్కడి పాలకులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ బాటలోనే నిర్ణయాలు తీసుకోవడం అత్యంత ఆక్షేపణీయమని లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. ఈ వివాదాస్పద చర్యపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తక్షణమే స్పందించి, జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
రాష్ట్రవ్యాప్త నిరసనలు.. రెండు రోజుల కార్యాచరణ
రేవంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీల సమావేశం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన ఉదయం 10:30 గంటలకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వివిధ రంగాల మేధావులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత 21వ తేదీన నగరంలోని బాబూ జగ్జీవన్రాం విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వామపక్ష శ్రేణులతో భారీ నిరసన ప్రదర్శన జరపాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదిత నిరసన కార్యక్రమాల్లో అన్ని వామపక్ష పార్టీల అగ్రనేతలు, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనున్నట్లు లెఫ్ట్ పార్టీల ఉమ్మడి వేదిక ప్రకటించింది.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!