NTV Telugu Site icon

TRS Plenary : ప్లీనరీకి ముస్తాబైన హైదరాబాద్‌..

టీఆర్‌ఎస్‌ పార్టీ అవిర్భవ వేడుకలు ఈ నెల 27న హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగనున్నాయి. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ వేదికగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున్న హజరుకానున్నారు. అయితే అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌ రోడ్లన్నీ టీఆర్‌ఎస్‌ స్వాగత తోరణాలతో గులాబిమయంగా మారాయి. ఎక్కడ చూసిన గులాబి వర్ణంశోభితంలా కనిపిస్తోంది.

అయితే హెచ్‌ఐసీసీలోని ప్లీనరీ సభా ప్రాంగణంలో మొత్తం 4500 కెపాసిటీతో హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి అధిష్ఠానం నగర నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్లీనరీ సమావేశాలకు రానున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు విభాగాలుగా కమిటీల బాధ్యతలను కేటీఆర్ ఆయా నాయకులు అప్పగించారు. అంతేకాకుండా ఈ ప్లీనరీ సమావేశాల్లో 33 రకాల వంటకాలను పార్టీ శ్రేణులకు వడ్డించబోతున్నారట.

33 ర‌కాల వెరైటీలు ఇవే..
డబుల్‌కామీట, గులాబ్‌జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్‌ బిర్యానీ, ధమ్‌కా చికెన్‌, మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా, వైట్‌ రైస్‌, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ, వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్‌,టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్స్‌ స్టాల్‌, అంబలి, బటర్‌ మిల్క్‌.