TRS: ఆందోళనలు ఉధృతం.. ఇక, ఢిల్లీలో ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో యాసంగిలో పండిన వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ ఆందోళనలు ఉధృతం చేసింది. ఇప్పటికే మండల కేంద్రాల్లో ధర్నాలు… జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాలను పూర్తి చేసిన టీఆర్ఎస్… గురువారం జిల్లా కేంద్రాలు… కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షలు చేపట్టింది. వరుస ఆందోళనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. శుక్రవారం నల్ల జెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించాయి టీఆర్ఎస్ శ్రేణులు. ధాన్యం కొనుగోలు విషయంలో మోడీ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు.
Read Also: TSRTC: మళ్లీ చార్జీలను పెంచిన ఆర్టీసీ.. డీజిల్ సెస్ పేరుతో భారీగా వడ్డింపు..
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
కేంద్రంపై పోరు కొనసాగించే క్రమంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీఆర్ఎస్. శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటు గ్రామాల్లో కూడా ఇళ్లపై నల్లజండాలు ఎగరవేసి నిరసన తెలిపారు. ఈ ఆందోళన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్. యాసంగిలో వరి ధాన్యంను కేంద్రమే మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ ను బలంగా వినిపించింది.. ఇక, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆందోళనలు ముగిశాయి. కేంద్రంపై పోరు తీవ్రతరం చేసే క్రమంలో ఈ నెల 11 న ఢిల్లీ తెలంగాణ భవన్ లో ధర్నా నిర్వహించనుంది టీఆర్ఎస్.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు నేతలు.. తెలంగాణ భవన్లో వేదిక ఏర్పాటు స్థలాన్ని ఈ రోజు పరిశీలించారు టీఆర్ఎస్ ఎంపీలు, నేతలు.
- Tags
- Delhi
- telangana
- TRS
- TRS Dharna
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..