TRS: ఆందోళనలు ఉధృతం.. ఇక, ఢిల్లీలో ధర్నా
తెలంగాణలో యాసంగిలో పండిన వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ ఆందోళనలు ఉధృతం చేసింది. ఇప్పటికే మండల కేంద్రాల్లో ధర్నాలు… జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాలను పూర్తి చేసిన టీఆర్ఎస్… గురువారం జిల్లా కేంద్రాలు… కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షలు చేపట్టింది. వరుస ఆందోళనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. శుక్రవారం నల్ల జెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించాయి టీఆర్ఎస్ శ్రేణులు. ధాన్యం కొనుగోలు విషయంలో మోడీ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు.
Read Also: TSRTC: మళ్లీ చార్జీలను పెంచిన ఆర్టీసీ.. డీజిల్ సెస్ పేరుతో భారీగా వడ్డింపు..
Also Read
కేంద్రంపై పోరు కొనసాగించే క్రమంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీఆర్ఎస్. శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటు గ్రామాల్లో కూడా ఇళ్లపై నల్లజండాలు ఎగరవేసి నిరసన తెలిపారు. ఈ ఆందోళన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్. యాసంగిలో వరి ధాన్యంను కేంద్రమే మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ ను బలంగా వినిపించింది.. ఇక, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆందోళనలు ముగిశాయి. కేంద్రంపై పోరు తీవ్రతరం చేసే క్రమంలో ఈ నెల 11 న ఢిల్లీ తెలంగాణ భవన్ లో ధర్నా నిర్వహించనుంది టీఆర్ఎస్.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు నేతలు.. తెలంగాణ భవన్లో వేదిక ఏర్పాటు స్థలాన్ని ఈ రోజు పరిశీలించారు టీఆర్ఎస్ ఎంపీలు, నేతలు.
- Tags
- Delhi
- telangana
- TRS
- TRS Dharna
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!