రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి : నామా నాగేశ్వరరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయవద్దని చెప్పాం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు.. పార్లమెంట్ లో ముందు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశాం. తెలంగాణలో పంట మొత్తం కొనాలి.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ధాన్యం పంట కొనుగోలు గురించి రెండు నెలల్లో 4,5 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు చర్చించారు. చివరికి చేతులు ఎత్తేసి.. ధాన్యం కొనుగోలు చేయమని చెప్తున్నారు. యాసంగి పంట కొనేదిలేదని చెప్పారు. ఖరీఫ్ లో పండిన ధాన్యం ఎంత కొనేది కూడా చెప్పం అని అంటున్నారు. అఖిల పక్ష భేటీకి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ అంశాలను పార్లమెంట్ లో లెవనెత్తుతాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వ్యవసాయ బిల్లులు రద్దు తో పాటు “కనీస మద్దతు ధర”కు చట్ట బద్ధత, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాం అన్నారు.
ఇక రైతులపై నమోదైన కేసులు ఎత్తేయాలి. మరణించిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ 3 లక్షలు ఇచ్చారు. ఉద్యమ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులను కేంద్రం కూడా ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశాం. మా ప్రతిపాదనకు అన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఓ వైపు వ్యవసాయ చట్టాల బిల్లులను వెనక్కు తీసుకుంటూనే మళ్ళీ విద్యుత్ బిల్లు పెట్టారు. దేశంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కృష్ణా జలాల పంపకాల అంశాన్ని విచారించేందుకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలోని హామీలు అన్ని నెరవేర్చాలి. ఎస్సి, ఎస్టీ బిల్లు అని యూపీ కి సంబంధించిన అంశాల మీద బిల్లు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన ఎలాంటి స్పందన లేదు. రైతుల అంశాలపై సభ లోపల, బయట పోరాడుతాం అని పేర్కొన్నారు నామా నాగేశ్వరరావు.
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!