రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి : నామా నాగేశ్వరరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయవద్దని చెప్పాం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు.. పార్లమెంట్ లో ముందు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశాం. తెలంగాణలో పంట మొత్తం కొనాలి.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ధాన్యం పంట కొనుగోలు గురించి రెండు నెలల్లో 4,5 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు చర్చించారు. చివరికి చేతులు ఎత్తేసి.. ధాన్యం కొనుగోలు చేయమని చెప్తున్నారు. యాసంగి పంట కొనేదిలేదని చెప్పారు. ఖరీఫ్ లో పండిన ధాన్యం ఎంత కొనేది కూడా చెప్పం అని అంటున్నారు. అఖిల పక్ష భేటీకి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ అంశాలను పార్లమెంట్ లో లెవనెత్తుతాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వ్యవసాయ బిల్లులు రద్దు తో పాటు “కనీస మద్దతు ధర”కు చట్ట బద్ధత, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాం అన్నారు.
ఇక రైతులపై నమోదైన కేసులు ఎత్తేయాలి. మరణించిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ 3 లక్షలు ఇచ్చారు. ఉద్యమ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులను కేంద్రం కూడా ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశాం. మా ప్రతిపాదనకు అన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఓ వైపు వ్యవసాయ చట్టాల బిల్లులను వెనక్కు తీసుకుంటూనే మళ్ళీ విద్యుత్ బిల్లు పెట్టారు. దేశంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కృష్ణా జలాల పంపకాల అంశాన్ని విచారించేందుకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలోని హామీలు అన్ని నెరవేర్చాలి. ఎస్సి, ఎస్టీ బిల్లు అని యూపీ కి సంబంధించిన అంశాల మీద బిల్లు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన ఎలాంటి స్పందన లేదు. రైతుల అంశాలపై సభ లోపల, బయట పోరాడుతాం అని పేర్కొన్నారు నామా నాగేశ్వరరావు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
తాజావార్తలు
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..