Thatikonda Rajaiah: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. మరోసారి కడియం ప్రస్తావన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి.. ఆ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రస్తావన తీసుకొచ్చారు.. అయితే.. ఈ సారి మాత్రం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రెండు కళ్లు.. ఒక వైపు చూస్తే కంటి చూపుపోతుందని వ్యాఖ్యానించారు.. ఇదే సమయంలో… ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరికే రావాలి.. అదే ప్రొటోకాల్ అని స్పష్టం చేశారు రాజయ్య… జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్ర తండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సర్పంచ్.. ఎమ్మెల్యే దగ్గరికే రావాలన్నారు.. ఎమ్మెల్యే దగ్గరికి రావడమే ప్రోటోకాల్ అని స్పష్టం చేశారు.. నేను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేను నా దగ్గరికి వస్తేనే.. నేను సీఎం దగ్గరకు వెళ్లి.. పనుల గురించి అడుగుతానని తెలిపారు.
Read Also: Akkineni Nagarjuna: భార్య నటన చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున
Also Read
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
గ్రామ బాగోగులు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదేనన్న రాజయ్య.. నియోజకవర్గం సమస్యలు ముఖ్యమంత్రికి దృష్టికి ఎమ్మెల్యేలే తీసుకెళ్లారు.. గ్రామ సమస్యలు సర్పంచ్ లు ఎమ్మెల్యేల దృష్టి తీసుకురావాలన్నారు.. గ్రామాలకు అభివృద్ధి చేసే బాధ్యత ఎమ్మెల్యే పైనే ఎక్కువగా ఉంటుందని తెలిపారు.. ఇక, కడియం శ్రీహరి ప్రస్తావన మరోసారి తీసుకొచ్చారు తాటికొండ రాజయ్య… కడియం శ్రీహరికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇచ్చి ఆరు నెలలు అయ్యిందన్న ఆయన.. తాను ఎప్పటి నుంచో ఎమ్మెల్యేను అనే తరహాలో కామెంట్లు చేశారు.. అయితే, ఇద్దరినీ రెండు కళ్లలాగా చూసుకోండి,.. ఒక వైపే చూస్తే కంటి చూపు పోతుంది అని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ మధ్య ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం నడిచింది.. కడియం శ్రీహరి వల్ల 361 మంది నక్సలైట్లు చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక రాజయ్య వ్యాఖ్యలకు కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. రాజయ్య చిల్లర చేష్టలు, అవినీతికి సంబంధించిన రికార్డులు అన్నీ తన దగ్గర ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.. అంతేకాదు ఆ తర్వాత.. కడియం శ్రీహరి చీకటి జీవితం అప్పటి టీడీపీ నేతలకు తెలుసు.. కడియం శ్రీహరి తనపై చేస్తున్న ఆరోపణలను తాను ఖండిస్తున్నా నంటూ మరోసారి రాజయ్య కౌంటర్ ఎటాక్ చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు తన ఆస్తులెంత? కడియం శ్రీహరి ఆస్తులెంత ? అంటూ ప్రశ్నించారు. ఇక, ఆ తర్వాత స్టేషన్ ఘనపురం టికెట్ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని.. తనకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల్లోకి విస్తృతంగా పర్యటిస్తానన్నారు రాజయ్య.. మొత్తంగా.. ఇద్దరి మధ్య ఏదో ఓ తరహాలో చర్చ సాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
-
Bank Holiday List: వచ్చే వారం బ్యాంకుకు వెళ్తున్నారా? వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్! ఎందుకో తెలుసా?
-
Vaibhav Sooryavanshi: ‘నన్ను విపరీతంగా బాధ పెట్టారు’.. వైభవ్ సూర్యవంశీ ఆవేదన..
-
CM Chandrababu : రెండేళ్ల పాలన.. చంద్రబాబు ప్రోగ్రెస్ కార్డ్ రెడీ!
-
Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!