MLA Methuku Anand:కార్పొరేట్ సంస్థల చేతుల్లో బీజేపీ స్టీరింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. దీనిపై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పందించారు. అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో బీజేపీ స్టీరింగ్ ఉందని మండిపడ్డారు.
జనం గోస – బీజేపీ భరోసా అంటే జనాలను గోస పెడతామని కచ్చితమైన భరోసా బీజేపీ ఇచ్చిందని అన్నారు. ఎస్సి రిజర్వేషన్ల ఫైల్, ఎస్టీల ఫైల్, బీసీ జనగణన ఫైల్ కేంద్రం దగ్గరే పెట్టుకుందని మండి పడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
మన నీళ్లు మన దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగ బద్దంగా ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వడం లేదని, నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో కేంద్రం మాట తప్పుతోందని పేర్కొన్నారు. నరేగా నిధుల విషయంలో 18 వేల కోట్లు అని amit షా అంటే, 30 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.
ఎవరు చెప్పింది నిజమని నిలదీశారు. తెలంగాణలో తుగ్లక్ పాలన అంటున్నారు! నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? రైతులకు క్షమాపణ చెప్పింది ఎవరు? అని ప్రశ్నించారు. భారతదేశంలో తుగ్లక్ పాలన జరుగుతుందా లేదా అనేది ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
ఇక.. తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడాడని.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 బిల్ విషయంలో టిఆర్ఎస్ పై చేసిన అమిత్ షా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. హోంమంత్రి స్థాయిలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు.
బీజేపీ ఎనిమిదేళ్ళలో తెలంగాణకు ఏం చేసింది ? టిఆర్ఎస్ ది కుటుంబ పాలన అంటున్న పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సిందియా, వసుంధర రాజే, బీవై విజయేంద్ర, వరుణ్ గాంధీ ఇంకా అనేక మంది బీజేపీలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాటం చేసిన కేటీఆర్ తెలంగాణ పాలనలో భాగస్వాములు కావొద్దంటా? ఎలాంటి పోరాటం చేయని బీజేపీ నేతలు రాజకీయాల్లో కొనసాగొచ్చా ? అని నిలదీశారు.
Akshay Kumar: మరోసారి కరోనా బారిన స్టార్ హీరో.. కేన్స్ ఫెస్టివల్కు దూరం
- Tags
- Amit Shah
- bjp
- kcr
- ktr
- MLA Methuku Anand
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!