MLA Methuku Anand:కార్పొరేట్ సంస్థల చేతుల్లో బీజేపీ స్టీరింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. దీనిపై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పందించారు. అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో బీజేపీ స్టీరింగ్ ఉందని మండిపడ్డారు.
జనం గోస – బీజేపీ భరోసా అంటే జనాలను గోస పెడతామని కచ్చితమైన భరోసా బీజేపీ ఇచ్చిందని అన్నారు. ఎస్సి రిజర్వేషన్ల ఫైల్, ఎస్టీల ఫైల్, బీసీ జనగణన ఫైల్ కేంద్రం దగ్గరే పెట్టుకుందని మండి పడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
Also Read
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
మన నీళ్లు మన దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగ బద్దంగా ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వడం లేదని, నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో కేంద్రం మాట తప్పుతోందని పేర్కొన్నారు. నరేగా నిధుల విషయంలో 18 వేల కోట్లు అని amit షా అంటే, 30 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.
ఎవరు చెప్పింది నిజమని నిలదీశారు. తెలంగాణలో తుగ్లక్ పాలన అంటున్నారు! నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? రైతులకు క్షమాపణ చెప్పింది ఎవరు? అని ప్రశ్నించారు. భారతదేశంలో తుగ్లక్ పాలన జరుగుతుందా లేదా అనేది ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
ఇక.. తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడాడని.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 బిల్ విషయంలో టిఆర్ఎస్ పై చేసిన అమిత్ షా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. హోంమంత్రి స్థాయిలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు.
బీజేపీ ఎనిమిదేళ్ళలో తెలంగాణకు ఏం చేసింది ? టిఆర్ఎస్ ది కుటుంబ పాలన అంటున్న పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సిందియా, వసుంధర రాజే, బీవై విజయేంద్ర, వరుణ్ గాంధీ ఇంకా అనేక మంది బీజేపీలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాటం చేసిన కేటీఆర్ తెలంగాణ పాలనలో భాగస్వాములు కావొద్దంటా? ఎలాంటి పోరాటం చేయని బీజేపీ నేతలు రాజకీయాల్లో కొనసాగొచ్చా ? అని నిలదీశారు.
Akshay Kumar: మరోసారి కరోనా బారిన స్టార్ హీరో.. కేన్స్ ఫెస్టివల్కు దూరం
- Tags
- Amit Shah
- bjp
- kcr
- ktr
- MLA Methuku Anand
తాజావార్తలు
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!