Off The Record: ఆ ఎంపీ మౌనమే ఆయనను చర్చల్లోకి తీసుకొస్తుందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆయన టీఆర్ఎస్ ఎంపీ. పెద్దగా చర్చల్లో ఉండరు. కానీ.. ఎంపీ మౌనమే ఆయన్ని చర్చల్లోకి తీసుకొస్తోంది. గతంతో పోల్చితే దూకుడు తగ్గించారని కేడర్ వాదన. దీనిపై పార్టీలోనే భిన్నవాదనలు ఉన్నా.. ఎంపీగారి సైలెన్సే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోందట.
ఎంపీ మౌనంగా ఉండటంతో చర్చ
ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వెంకటేష్ నేతకాని .. వీఆర్ఎస్ తీసుకుని క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. 2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు వెంకటేష్. గులాబీ కండువా కప్పుకోవడంతోనే వెంకటేష్కు పెద్దపల్లి లోకసభ నుంచి పోటీచేసే అవకాశం దక్కింది. ఆ ఎన్నికలో పెద్దపల్లి ఎంపీగా గెలిచి లోకసభలో అడుగుపెట్టారు. అప్పట్లో రాజకీయ చర్చల్లో నలిగిన ఆయన తర్వాత పెద్దగా మెయిన్స్ట్రీమ్లోకి వచ్చింది లేదు. ఇప్పుడు మౌనవ్రతంతో టాక్ ఆఫ్ ది పార్టీ అయ్యారట.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఎంపీ ఎందుకు స్లో అయ్యారు?
ఎంపీగా గెలిచాక యక్టివ్గా ఉంటూ వచ్చారు వెంకటేష్. పార్లమెంట్లో టీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొని కేంద్ర సర్కార్పై విమర్శలు చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్నీ ఆయన వదలలేదు. అయితే ఈ మధ్య కాలంలో పెద్దపల్లి ఎంపి యాక్టివ్గా లేరనే గుసగుసలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఎందుకు ఎంపి స్లో అయ్యారు అని ఆరా తీస్తున్నారట. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను.. నాయకుల తీరును జనం గమనిస్తున్నారు. ఆ క్రమంలోనే ఎంపీపైనా ఫోకస్ పడిందట.
పార్టీ అప్పగించిన పనిలో ఉన్నారా?
ఎంపీ వెంకటేష్ మౌనంగా ఉండటానికీ కారణాలు ఉన్నాయన్నది గులాబీ నేతలు చెప్పేమాట. పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడంతో వాటితో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారుతుండటంతో.. వెంకటేష్కు కొన్ని బాధ్యతలు అప్పగించారట. ఆ టాస్క్ను పూర్తి చేసే పనిలో ఉన్నారట ఎంపీ. అందుకే మునుపటిలా చర్చల్లోకి రావడం లేదని.. గతంలో ప్రభుత్వ ఉద్యోగి కావడంతో.. ఆ లైన్లో పనిచేసుకుంటున్నారని కొందరి వాదన. ఎంపీ మౌనానికి అదే ప్రధాన కారణమని అనుచరుల మాట కూడా.
ఎంపీ మౌనంతో సందేహాలకు బీజం
షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది అసెంబ్లీ.. 2024లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఇప్పటికే ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. నేతల కదలికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అందుకే పెద్దపల్లి పరిధిలో ఎంపీ చర్చల్లోకి వచ్చారని… ఒక్కసారిగా మౌనం దాల్చడంతో అనుమానాలకు బీజం వేసిందని గులాబీ శ్రేణుల అభిప్రాయం. మరి.. పార్టీ అప్పగించిన టాస్క్ పూర్తయిన తర్వాత ఎప్పటిలా ఎంపీ వెంకటేష్ పొలిటికల్ లైన్లో కనిపిస్తారో.. లేక మౌనంగానే పనిచేసుకుని వెళ్లిపోతారో చూడాలి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!