7 వేల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం: పల్లా రాజేశ్వర్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ధాన్యం సేకరణ కొనసాగుతుందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై ఫైర్ అయ్యారు. సిగ్గులేకుండా బీజేపీ నేతలు గవర్నర్ను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపారన్నారు. మొహం మీద కొట్టినట్టు అంత బాగుంది అని రైతులు వారికి సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు. 5,447 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించి …రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశామని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. రాష్ర్టంలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిత్యం పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వచ్చే యాసంగిలో వరి తీసుకోకుండా చేశారు…మా వరిని తీసుకునే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామన్నారు.
రైతుల నుంచి వరి ధాన్యం తీసుకోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. వరి ధాన్యం సేకరించే కేంద్ర సర్కారుకే పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లో పూర్తి చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. 51 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరును టీఆర్ఎస్ సర్కార్ అందించిందన్నారు. 26 లక్షల వ్యవసాయ మోటర్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల సంఖ్య క్రమంగా తగ్గిందన్నారు. వివిధ కారణాలతో చనిపోయిన 66 వేల123కి రైతు భీమా రూపంలో సాయాన్ని అందించామన్నారు.
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
ఎల్ఐసీని కేంద్రం ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ హయాంలో ప్రగతి కనిపించడంలేదా అంటూ ప్రతిపక్షాలపై ఆయన విరుచుకు పడ్డారు. దేశంలో తెలంగాణలో వ్యవసాయ రంగం గొప్ప ప్రగతిని సాధించిందని పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అనంతరం కాంగ్రెస్పై విమర్శల దాడులకు దిగారు. రేవంత్ రెడ్డి వాడో పిచ్చోడన్నారు. దేశంలో కాంగ్రెస్ ఉన్నదిలేదు. సచ్చింది లేదన్నారు. సీఎం స్టాలిన్ పిలిస్తే … కేసీఆర్ వెళ్లి కలుస్తారు ఎన్డీఏ సర్కార్ దిగిపోయే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. బీజేపీ పై పోరాటం విషయంలో పోరాడే శక్తులతో సమయానుసారం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!