సీఎం కేసీఆర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపిన పార్టీ జిల్లా అధ్యక్షులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో పలు జిల్లాల అధ్యక్షులు అధినేత, సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Read Also తెలంగాణ కోవిడ్ అప్డేట్.. తగ్గినా.. ఇంకా భారీగానే..
Also Read
- 1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
వీరితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు తదితరులున్నారు.హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా నియమితులైన ఎంపీ మాలోత్ కవిత లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లు ఉన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబు నగర్ జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉన్నారు.
ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్త గూడెం అధ్యక్షుడు ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నేతలకు అధ్యక్ష పదవుల్లో ప్రాధాన్యతనిచ్చినందుకు గిరిజన నేతలు ఆత్రం సక్కు, కోరం కనకయ్య, కోవా లక్ష్మి లు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?