ఈనెల 6న ఆదివారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్వంలో 5కే రన్, 2కే రన్ నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎన్ఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను షాదాన్ కాలేజ్, నిరంకారీ భవన్ మీదుగా మళ్లిస్తారు. అదేవిధంగా ఇక్బార్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద మళ్లించి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. సంజీవయ్య పార్కుకు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ ఎక్స్రోడ్డు మీదుగా అనుమతిస్తారు. షీటీమ్స్ రన్ నేపథ్యంలో ఎం.ఎస్.మక్తా, ప్రసాద్ ఐమ్యాక్స్ ఎదురుగా, డాక్టర్స్ కార్ పార్కింగ్, ఎంఎంటీఎస్ నెక్లెస్ రోడ్డు, లేక్ పోలీస్ స్టేషన్ పక్కన ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను పోలీసులు ఏర్పాటు చేశారు.