Traffic Restrictions: హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది.. తొమ్మిదిరోజుల పాటు గణపయ్యను భక్తి శ్రద్ధలతో.. భజన కీర్తనలు, ఆటాపాటలతో కొలిచిన భక్తులు.. ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు సమయం దగ్గర పడింది.. సాధారణంగా.. గణేష్ చవితి మలి రోజు నుంచే.. చిన్ని చిన్న వినాయకులు మొదలు… కొన్ని పెద్ద విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తూ వస్తుంటారు.. కానీ, హైదరాబాద్ లోని మహా నిమజ్జన కార్యక్రమం మాత్రం రెండు రోజుల పాటు సాగుతోంది.. బాలాపూర్ గణపతి శోభయాత్రతో ప్రారంభమై.. మహానగరంలోని నలువైపుల నుంచి ట్యాంక్బండ్కు తరలివస్తున్నారు గణపయ్యలు.. రేపు హైదరాబాద్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం సాగనుంది.. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలు సహా.. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు… రేపు ఉదయం నుండి ఎల్లుండి ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్..
Read Also: Heavy Rains: కుండపోత ఆగలేదు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
గణేష్ నిమజ్జనం, హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలపై ప్రత్యేకంగా ఎన్టీవీతో మాట్లాడారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.. రేపు (శుక్రవారం) ఉదయం నుండి ఎల్లుండి (శనివారం) ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.. బాలాపూర్ వినాయకుడు నుండి ఉదయం 10 గంటలకు శోభాయాత్ర మొదలవుతుందన్న ఆయన.. బాలాపూర్ నుండి సౌత్ జోన్ మీదుగా చార్మినార్ , ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరుగుతుందన్నారు.. ఈ సందర్భంగా మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారు.. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలు అనుమతి లేదని స్పష్టం చేశారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సేన్సాగర్, హుస్సేన్ సాగర్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో 20 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు జాయింట్ సీపీ రంగనాథ్.. సెంట్రల్ జోన్ లోనే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.. ఖైరతాబాద్ వినాయకుడు ఉదయం నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుంది.. ఖైరతాబాద్ నుండి ఎన్టీఆర్ మార్గ్ రూట్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు.. వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నాం.. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. సొంత వాహనాల్లో వచ్చి వారు.. కేటాయించిన ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేసుకోవాలని సూచించారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.

తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..