TPCC Mahesh Goud : కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరుకు కార్పొరేషన్ చైర్మన్లు..
- ఈ నెలాఖరుకు కార్పొరేషన్, బోర్డు చైర్మన్ల భర్తీ
- గ్లోబల్ సమ్మిట్తో తెలంగాణకు భారీ పెట్టుబడులు
- ఫ్యూచర్ సిటీ–ఫోర్త్ సిటీపై ప్రభుత్వం స్పష్టత
- బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభవార్త చెప్పారు. ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ చైర్మన్లు, మిగిలిన చైర్మన్ పదవులు, బోర్డు పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో చిట్చాట్ లో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి దేశ, విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్, దూరదృష్టికి గ్లోబల్ సమ్మిట్ నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సమ్మిట్ విజయంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ను చూసి హరీష్ రావుకు గుబులు పట్టిందని విమర్శించారు. దావోస్ సమ్మిట్ వలన దాదాపు లక్ష 70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ఫోర్త్ సిటీ చారిత్రాత్మక నిర్ణయమని, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ రెండూ ఒకటేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అన్ని రంగాలకు కేంద్రంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. ఫ్యూచర్ సిటీతో దేశం చూపు తెలంగాణ వైపే మళ్లిందని అన్నారు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
Dandruff Remedies: డ్యాండ్రఫ్ జాడ మాయం చేసే 5 నేచురల్ టిప్స్ ఇవే..
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా ప్రజాపాలన కొనసాగుతోందని తెలిపారు. మెట్రో ఫేజ్ విస్తరణతో పాటు మూసీ నది సుందరీకరణ వంటి కీలక పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించే అంశంపైనా చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్ర ఉద్యోగులపై హరీష్ రావు తన స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసం పాలైందని ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తుకు గ్లోబల్ సమ్మిట్ ఒక సరికొత్త దశను తీసుకొచ్చిందని అన్నారు.
కవిత వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ నేతల లూటీలు బయటకు వస్తున్నాయని, ఆమె లూటీ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ల ఏకగ్రీవ ఎన్నిక సాధించడం సాధారణ విషయం కాదని, అందుకు ప్రభుత్వ విధానాలే కారణమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. గతంలో తాను 50 ఎకరాల భూమిని భూదానంగా ఇచ్చానని ఈ సందర్భంగా మహేష్ గౌడ్ గుర్తు చేశారు.
Tilak Varma Record: తొలి భారత బ్యాట్స్మన్గా తిలక్ వర్మ రేర్ రికార్డు!
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!