Site icon NTV Telugu

Hyderabad: ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్..

Telangana

Telangana

Hyderabad: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పదేళ్ల ఉమ్మడి బంధానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఏపీలుగా విభజించిన తర్వాత.. విభజిత ఏపీకి పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇక నుంచి హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్‌లో విభజన సమస్యలు లేని భవనాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఉమ్మడి రాజధానిని పదేళ్లపాటు ప్రకటించినా.. 2016-17లో ఏపీ ప్రభుత్వం అక్కడికి వెళ్లింది. అయితే, జూన్ 1, 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ సంబంధిత శాఖల పరిధిలోని భవనాలన్నీ తెలంగాణకు చెందుతాయి.

Read also: D. Sridhar Babu: అలుపెరుగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం..

కాగా, హైదరాబాద్‌లోని కొన్ని భవనాలను కొంతకాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. విభజన చట్టంలో అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నందున విభజన చట్టాన్ని సవరించి మరికొంత సమయం ఇవ్వాలని ఏపీ కోరినట్లు సమాచారం. చరిత్రను పరిశీలిస్తే తెలంగాణ ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. 1956లో మద్రాసు నుంచి ఏపీని విడదీసి తెలంగాణలో విలీనం చేసి ఆంధ్ర ప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. చివరకు స్వరాష్ట్రాన్ని తిరిగి పొందారు.
TGRTC MD VC Sajjanar: గుడ్ న్యూస్.. త్వరలోనే టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ..

Exit mobile version