TS TET Exam: నేడే టెట్ ఎగ్జామ్.. బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతోనే పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS TET EXM: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిరుద్యోగుల ఉద్యోగ ఆకాంక్షలను తీర్చేందుకు ప్రభుత్వం గ్రూప్ పరీక్షలు, ఇతర ఉద్యోగాల ఖాళీలను వరుసగా భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు హాజరు కావడానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. TRTతో పాటు టెట్ మార్కులు కలిసి వస్తాయి. దీంతో ఇప్పటికే రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు బీఈడీ, టీటీసీ చదివిన అభ్యర్థులు కూడా టెట్ రాసేందుకు సిద్ధమయ్యారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఈడీ స్కూల్ అసిస్టెంట్ (పేపర్-2), టీటీసీ క్వాలిఫికేషన్ (పేపర్-1) అర్హులు. ఇందుకోసం ఇప్పటికే కోచింగ్లు పూర్తి చేసుకుని సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించనుంది.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోనూ కలెక్టర్ల ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లను దాదాపు పూర్తి చేశారు. ఈ పరీక్షలు రెండుసార్లు నిర్వహించనున్నారు. టీటీసీ అర్హత కోసం పేపర్-1 పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, బీఈడీ అర్హతకు సంబంధించిన పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పాలమూరులోని ఐదు జిల్లాల్లో పేపర్-1 పరీక్షకు 46,998 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, 198 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-2 పరీక్షకు 33,800 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, 148 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు గురువారం మధ్యాహ్నం, శుక్రవారం సెలవులు ఇచ్చారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. బస్సులు కూడా సమయానికి నడుస్తాయని ఆ దేశాలు తెలిపాయి. పోలీసు బందోబస్తుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అభ్యర్థులకు సూచనలు..
* అభ్యర్థులు హాల్టికెట్పై ఫోటోగ్రాఫ్, సంతకాన్ని సరిచూసుకోవాలి. లేదంటే తాజా ఫొటోపై గెజిటెడ్ అధికారి సంతకం చేయాలి.
* గెజిటెడ్ అటెస్టేషన్ అందుబాటులో ఉంటేనే పరీక్ష హాలులోకి ప్రవేశం ఉంటుంది.
* గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి.
* ఒక నిమిషం నియమం వర్తిస్తుంది
* రెండు బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మరియు హాల్ టికెట్ తీసుకురండి.
* పరీక్ష పూర్తయిన తర్వాత కేంద్రం బయటకు రావాలి.
* మొదటిది వస్తే మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేస్తారు.
* ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు. సెల్, రిమోట్ ఉన్న కారు తాళాలు ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు.
* OMR షీట్ను మడవకండి, పిన్ చేయవద్దు లేదా ట్యాంపర్ చేయవద్దు.
ఇక మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు కలిపి 15 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలతో పాటు తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అభ్యర్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి బయటకు రావాలి.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!