Telangana: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యాదినోత్సవం.. రాగిజావ పంపిణీతో బడులు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతో పాటు పాఠశాలలను ప్రారంభించి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 25,26,907 మం ది విద్యార్థులకు ఉదయం 250 ఎంఎల్ రాగిజావను అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా వెయ్యి ఆధునీకరించిన పాఠశాలలను ప్రారంభించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మూడు వర్క్బుక్లు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని 19,800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు. 1,600 పాఠశాలల్లో 4,800 డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. 5 వేల పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు ప్రారంభిస్తామన్నారు.
Read also: YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ఈ విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతారు. రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో 245 పాఠశాలలను ఇంటర్ వరకు పొడిగించారు. వికలాంగ పిల్లల కోసం 467 భివా కేంద్రాలను నడుపుతుండగా వారి తల్లిదండ్రులకు రూ. 3,500 బాలికలకు సంవత్సరానికి రూ. 2,000 స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా 12 పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయగా, 15 కళాశాలలకు సొంత భవనాలు, 22 హాస్టళ్లను నిర్మించింది. విద్యాశాఖలో 3,997 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 తర్వాత కొత్తగా 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇంటర్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిజిటల్ ఆన్ స్క్రీన్ అసెస్మెంట్ను ప్రారంభించింది. కొత్తగా మహిళా వర్సిటీ, హార్టికల్చర్, ఫారెస్ట్, వెటర్నరీ వర్సిటీలను ఏర్పాటు చేశారు. గురుకులాల్లో చదివిన 930 మంది డాక్టర్లు, 1517 మంది ఇంజినీర్లు అయ్యారు. ముస్లిం బాలికల కళాశాల జాతీయ స్థాయి విద్యలో రాష్ట్రంలో రెండవ స్థానంలో మరియు పాఠశాల విద్యలో మూడవ స్థానంలో ఉంది.
YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!