Telangana: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యాదినోత్సవం.. రాగిజావ పంపిణీతో బడులు ప్రారంభం
Telangana: దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతో పాటు పాఠశాలలను ప్రారంభించి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 25,26,907 మం ది విద్యార్థులకు ఉదయం 250 ఎంఎల్ రాగిజావను అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా వెయ్యి ఆధునీకరించిన పాఠశాలలను ప్రారంభించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మూడు వర్క్బుక్లు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని 19,800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు. 1,600 పాఠశాలల్లో 4,800 డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. 5 వేల పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు ప్రారంభిస్తామన్నారు.
Read also: YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
Also Read
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
ఈ విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతారు. రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో 245 పాఠశాలలను ఇంటర్ వరకు పొడిగించారు. వికలాంగ పిల్లల కోసం 467 భివా కేంద్రాలను నడుపుతుండగా వారి తల్లిదండ్రులకు రూ. 3,500 బాలికలకు సంవత్సరానికి రూ. 2,000 స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా 12 పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయగా, 15 కళాశాలలకు సొంత భవనాలు, 22 హాస్టళ్లను నిర్మించింది. విద్యాశాఖలో 3,997 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 తర్వాత కొత్తగా 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇంటర్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిజిటల్ ఆన్ స్క్రీన్ అసెస్మెంట్ను ప్రారంభించింది. కొత్తగా మహిళా వర్సిటీ, హార్టికల్చర్, ఫారెస్ట్, వెటర్నరీ వర్సిటీలను ఏర్పాటు చేశారు. గురుకులాల్లో చదివిన 930 మంది డాక్టర్లు, 1517 మంది ఇంజినీర్లు అయ్యారు. ముస్లిం బాలికల కళాశాల జాతీయ స్థాయి విద్యలో రాష్ట్రంలో రెండవ స్థానంలో మరియు పాఠశాల విద్యలో మూడవ స్థానంలో ఉంది.
YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
తాజావార్తలు
-
Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!