Telangana: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యాదినోత్సవం.. రాగిజావ పంపిణీతో బడులు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతో పాటు పాఠశాలలను ప్రారంభించి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 25,26,907 మం ది విద్యార్థులకు ఉదయం 250 ఎంఎల్ రాగిజావను అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా వెయ్యి ఆధునీకరించిన పాఠశాలలను ప్రారంభించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మూడు వర్క్బుక్లు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని 19,800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు. 1,600 పాఠశాలల్లో 4,800 డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. 5 వేల పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు ప్రారంభిస్తామన్నారు.
Read also: YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
Also Read
ఈ విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతారు. రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో 245 పాఠశాలలను ఇంటర్ వరకు పొడిగించారు. వికలాంగ పిల్లల కోసం 467 భివా కేంద్రాలను నడుపుతుండగా వారి తల్లిదండ్రులకు రూ. 3,500 బాలికలకు సంవత్సరానికి రూ. 2,000 స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా 12 పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయగా, 15 కళాశాలలకు సొంత భవనాలు, 22 హాస్టళ్లను నిర్మించింది. విద్యాశాఖలో 3,997 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 తర్వాత కొత్తగా 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇంటర్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిజిటల్ ఆన్ స్క్రీన్ అసెస్మెంట్ను ప్రారంభించింది. కొత్తగా మహిళా వర్సిటీ, హార్టికల్చర్, ఫారెస్ట్, వెటర్నరీ వర్సిటీలను ఏర్పాటు చేశారు. గురుకులాల్లో చదివిన 930 మంది డాక్టర్లు, 1517 మంది ఇంజినీర్లు అయ్యారు. ముస్లిం బాలికల కళాశాల జాతీయ స్థాయి విద్యలో రాష్ట్రంలో రెండవ స్థానంలో మరియు పాఠశాల విద్యలో మూడవ స్థానంలో ఉంది.
YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!