Telangana: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యాదినోత్సవం.. రాగిజావ పంపిణీతో బడులు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతో పాటు పాఠశాలలను ప్రారంభించి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 25,26,907 మం ది విద్యార్థులకు ఉదయం 250 ఎంఎల్ రాగిజావను అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా వెయ్యి ఆధునీకరించిన పాఠశాలలను ప్రారంభించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మూడు వర్క్బుక్లు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని 19,800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు. 1,600 పాఠశాలల్లో 4,800 డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. 5 వేల పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు ప్రారంభిస్తామన్నారు.
Read also: YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ఈ విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతారు. రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో 245 పాఠశాలలను ఇంటర్ వరకు పొడిగించారు. వికలాంగ పిల్లల కోసం 467 భివా కేంద్రాలను నడుపుతుండగా వారి తల్లిదండ్రులకు రూ. 3,500 బాలికలకు సంవత్సరానికి రూ. 2,000 స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా 12 పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయగా, 15 కళాశాలలకు సొంత భవనాలు, 22 హాస్టళ్లను నిర్మించింది. విద్యాశాఖలో 3,997 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 తర్వాత కొత్తగా 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇంటర్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిజిటల్ ఆన్ స్క్రీన్ అసెస్మెంట్ను ప్రారంభించింది. కొత్తగా మహిళా వర్సిటీ, హార్టికల్చర్, ఫారెస్ట్, వెటర్నరీ వర్సిటీలను ఏర్పాటు చేశారు. గురుకులాల్లో చదివిన 930 మంది డాక్టర్లు, 1517 మంది ఇంజినీర్లు అయ్యారు. ముస్లిం బాలికల కళాశాల జాతీయ స్థాయి విద్యలో రాష్ట్రంలో రెండవ స్థానంలో మరియు పాఠశాల విద్యలో మూడవ స్థానంలో ఉంది.
YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!