Delhi: మరీ కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాధ రథయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: నేడు జగన్నాధ రధయాత్ర. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో జగన్నాథుని ఆలయాలన్నీ ఇప్పటికే భక్తులతో కళకళలాడుతున్నాయి. రథయాత్ర మొదలయ్యే సమయానికి భక్తుల రద్దీ మరింత పెరుగనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్ర జరుపుకుంటారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం జగన్నాథుడు అంటే విశ్వమంతటికి నాథుడు లేదా ప్రపంచానికి ప్రభువు అని అర్థం. పూరీ నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడంవల్ల అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలాలు లభిస్తాయని ప్రజల విశ్వాసం. పూరీ, అహ్మదాబాద్లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం బయలుదేరనుంది. ఒడిశాలోని పూరీలో, గుజరాత్లోని అహ్మదాబాద్లోగల జగన్నాథ స్వామి ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఈ పవిత్రయాత్రను నిర్వహించనున్నారు.
Read also:Ashes 2023: రసవత్తరంగా యాషెస్ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్కు 7 వికెట్లు!
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ఒడిశాలోని పూరీ జగన్నాధుని రధయాత్ర అసంఖ్యాక భక్తులను అలరించనుంది. ఉదయం 9 గంటల లోపు జగన్నాధ, బలబద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్టించి తరువాత మంగళహారతి చేపడతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూరీ రాజు గజపలి దివ్వసింగ్దేవ్ రథాలపై చెరాపహర(బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. పూరీలో జరిగే రథయాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ సారి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Read also:PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..
సికింద్రాబాద్ జనరల్ బజార్లోని జగన్నాథ ఆలయం ట్రస్ట్ గత 130 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా రథయాత్రను నిర్వహిస్తోంది. రథయాత్రను రథోత్సవం అని కూడా పిలుస్తారు. పెద్ద ఊరేగింపులో భగవాన్ జగన్నాథుడు, బలభద్రుడు మరియు దేవి సుభద్ర యొక్క అద్భుతమైన రథాలను వేలాది మంది భక్తులు లాగుతారు. ఆలయ ద్వారాలు ఉదయం 6.15 నుండి దర్శనం కోసం తెరుచుకుంటాయి మరియు మధ్యాహ్నం 1 గంటలకు మూసివేయబడతాయి. ఆ తర్వాత, రథయాత్ర ఊరేగింపు ఆలయం నుండి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, జనరల్ బజార్ మీదుగా, సాయంత్రం 6.30 నుండి 10.30 గంటల వరకు MG రోడ్ గుండా వెళుతుంది. ఆ తర్వాత అది హిల్ స్ట్రీట్, రాణిగంజ్ గుండా వెళుతుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ఆలయానికి తిరిగి చేరుకుంటుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!