తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 257 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఒక్కరు మృతిచెందారు.. ఇదే సమయంలో 409 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,376 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,594 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,870 కు చేరుకుంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,335 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.