Tiger Tension: నిర్మల్ జిల్లాలో చిరుతల అలజడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వెళ్ళాలంటేనే రైతులు భయంతో బిక్కు
బిక్కుమంటున్నారు..రోజుఎక్కడో ఒకచోట చిరుతల సంచారం కలకలం రేపుతోంది..ఒక్కరోజు మూడు చిరుతలు రైతుల కంటపడడం కేకలు పెడితే అవి అడవిలోకి పారిపోయాయి.. మరుసటిరోజు మరోచోట లేగదూడను చంపేశాయి చిరుతలు.
నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం పెరిగిందా? లేక వలస వచ్చిన చిరుతలే సంచరిస్తున్నాయా అనేది అంతుచిక్కడం లేదంటున్నారు స్థానికులు. నిర్మల్ జిల్లాలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. జిల్లాలోని సారంగపూర్ మండలం బీరవెల్లిలో రాత్రిళ్ళు పంటపొలాలకు వెళ్లే రైతులకు చిరుతలు కనిపించాయి. వెంటనే మిగతా రైతులకు సమాచారం ఇవ్వగా అంతా కలిసి పెద్దఎత్తున కేకలువేశారు. దీంతో చిరుతలు పారిపోయినట్లు రైతులు తెలిపారు. మొత్తం మూడు చిరుతలు కనిపించాలని రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు..
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
నిర్మల్ జిల్లాలో చిరుత పులుల సంచారం తరచూ పశువులపై దాడిచేస్తూ హతమారుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతూ ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో భయంభయంగా గడుపుతున్నారు.తాజాగా కుంటాల మండలం మేదన్ పూర్ గ్రామంలో లేగ దూడలపై దాడిచేసి హతమార్చింది చిరుత. ఈరెండు ఘటనలతో ప్రజలు, రైతులు తీవ్రభయాందోళనలు వ్యక్తంచేస్తూ బిక్కుబిక్కుమంటూ భయంభయంగా గడుపుతున్నామంటున్నారు.
పంట చేతికొచ్చిన దశలో అడవి జంతువుల బారినుండి పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రిపూట కాపలాకు వెళ్తున్నారు. రాత్రిపూట చీకట్లో చిరుతపులులు ఏంచేస్తాయోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సారంగాపూర్, దిలవార్పూర్, కుంటాల, లోకేశ్వరం మండలాల పరిధిలోని ప్రాంతాల్లో గతకొంతకాలంగా ఆవులు లేగదూడలు మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తున్నాయి. దీంతో తమ పశువులతో పాటు తమకు సైతం రక్షణలేదనే భావనతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చిరుత పులులు అటవీప్రాంతంలో మాత్రమే సంచరిస్తాయని అవి ఎవరికీ హాని తలపెట్టవని పంటచేలల్లో సైతం సంచారం చేయవని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పశువులపై దాడులు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. అలా చేస్తే ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పిస్తామని వాటికి హానికలిగించవద్దని అంటున్నారు అటవీశాఖ అధికారి జైపాల్ రెడ్డి. మహారాష్ట్ర శివారు ప్రాంతాల్లో, అలాగే తెలంగాణలోని వివిధ గ్రామాల శివారు ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తుంటాయని అధికారులు అంటున్నారు. మొత్తానికి చిరుతపులుల సంచారంతో ఎప్పుడేం జరుగుతుందో అని ప్రజలతో పాటు రైతులు భయంభయంగా గడుపుతున్నారు.
- Tags
- cheetah
- Cows
- Crops
- Damage
- dilwarapur
తాజావార్తలు
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!