Tiger Tension: నిర్మల్ జిల్లాలో చిరుతల అలజడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వెళ్ళాలంటేనే రైతులు భయంతో బిక్కు
బిక్కుమంటున్నారు..రోజుఎక్కడో ఒకచోట చిరుతల సంచారం కలకలం రేపుతోంది..ఒక్కరోజు మూడు చిరుతలు రైతుల కంటపడడం కేకలు పెడితే అవి అడవిలోకి పారిపోయాయి.. మరుసటిరోజు మరోచోట లేగదూడను చంపేశాయి చిరుతలు.
నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం పెరిగిందా? లేక వలస వచ్చిన చిరుతలే సంచరిస్తున్నాయా అనేది అంతుచిక్కడం లేదంటున్నారు స్థానికులు. నిర్మల్ జిల్లాలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. జిల్లాలోని సారంగపూర్ మండలం బీరవెల్లిలో రాత్రిళ్ళు పంటపొలాలకు వెళ్లే రైతులకు చిరుతలు కనిపించాయి. వెంటనే మిగతా రైతులకు సమాచారం ఇవ్వగా అంతా కలిసి పెద్దఎత్తున కేకలువేశారు. దీంతో చిరుతలు పారిపోయినట్లు రైతులు తెలిపారు. మొత్తం మూడు చిరుతలు కనిపించాలని రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు..
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
నిర్మల్ జిల్లాలో చిరుత పులుల సంచారం తరచూ పశువులపై దాడిచేస్తూ హతమారుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతూ ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో భయంభయంగా గడుపుతున్నారు.తాజాగా కుంటాల మండలం మేదన్ పూర్ గ్రామంలో లేగ దూడలపై దాడిచేసి హతమార్చింది చిరుత. ఈరెండు ఘటనలతో ప్రజలు, రైతులు తీవ్రభయాందోళనలు వ్యక్తంచేస్తూ బిక్కుబిక్కుమంటూ భయంభయంగా గడుపుతున్నామంటున్నారు.
పంట చేతికొచ్చిన దశలో అడవి జంతువుల బారినుండి పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రిపూట కాపలాకు వెళ్తున్నారు. రాత్రిపూట చీకట్లో చిరుతపులులు ఏంచేస్తాయోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సారంగాపూర్, దిలవార్పూర్, కుంటాల, లోకేశ్వరం మండలాల పరిధిలోని ప్రాంతాల్లో గతకొంతకాలంగా ఆవులు లేగదూడలు మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తున్నాయి. దీంతో తమ పశువులతో పాటు తమకు సైతం రక్షణలేదనే భావనతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చిరుత పులులు అటవీప్రాంతంలో మాత్రమే సంచరిస్తాయని అవి ఎవరికీ హాని తలపెట్టవని పంటచేలల్లో సైతం సంచారం చేయవని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పశువులపై దాడులు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. అలా చేస్తే ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పిస్తామని వాటికి హానికలిగించవద్దని అంటున్నారు అటవీశాఖ అధికారి జైపాల్ రెడ్డి. మహారాష్ట్ర శివారు ప్రాంతాల్లో, అలాగే తెలంగాణలోని వివిధ గ్రామాల శివారు ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తుంటాయని అధికారులు అంటున్నారు. మొత్తానికి చిరుతపులుల సంచారంతో ఎప్పుడేం జరుగుతుందో అని ప్రజలతో పాటు రైతులు భయంభయంగా గడుపుతున్నారు.
- Tags
- cheetah
- Cows
- Crops
- Damage
- dilwarapur
తాజావార్తలు
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!