Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Thummala Nageswara Rao Review Meeting With Agriculture And Marketing Department Officials

Thummala Nageswara Rao: వ్యవసాయం, మార్కెంటింగ్ శాఖలతో మంత్రి తుమ్మల సమీక్ష

Published Date :December 12, 2023 , 4:52 pm
By snehalatha
Thummala Nageswara Rao: వ్యవసాయం, మార్కెంటింగ్ శాఖలతో మంత్రి తుమ్మల సమీక్ష
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్ర రైతాంగానికి దన్నుగా ఉండేలా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వ్యవసాయశాఖ కార్యదర్శి కార్యాలయంలో మంగళవారం రెండు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల పనితీరు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల మాట్లాడుతూ.. వ్యయవసాయ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారిస్తున్నారన్నారు. సాగురంగంలో అనేక సంస్కరణలు చేపట్టేలా ప్రభుత్వం సంకల్పంతో ఉందన్నారు.

ఈ సందర్భంగా  వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల పూర్తి సమాచారంతో ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని ఆయాశాఖల ఉన్నతాధికారులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యానశాఖ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల వివరాలు సమర్పించాలన్నారు. వ్యవసాయ పరిధిలోని అన్ని కార్పొరేషన్ల ఉన్నతాధికారుల తో సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి పనుల కోసం స్థానికంగా ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల సేవలు వినియోగించుకోవాలని..ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం 197 మార్కెట్ యార్డుల స్థితిగతులు, వాటి పనితీరు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర వివరాలు అందించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల్లో సాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై వీడియో రూపంలో సమగ్ర నివేదిక అందించాలని సూచించారు.

ఇప్పటికే మంజూరైన పనులకు  సంబంధించిన పనులు మొదలు కాని వాటి సమగ్ర వివరాలు జతచేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మార్కెటింగ్ సమస్యలు, క్రయవిక్రయాలు, ధరలు తదితర అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పారు. ఆరు నెలలు కష్టపడి రైతు పండించిన పంటల ఉత్పత్తులను అమ్ముకునే మార్కెట్ యార్డులు వారికి దన్నుగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. మార్కెట్ యార్డుల్లో సమస్యల్ని ఎప్పటికప్పుడు మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షించాలని..ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వర్షాలు, ఇతర ఇబ్బందులతో ఎక్కాడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో గొప్పగా పనితీరు కనబరుస్తున్న మార్కెట్లను మోడల్ గా తీసుకుని..ఇక్కడ ఒకటి రెండు మార్కెట్ యార్డుల్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మార్కెటింగ్ శాఖలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు.
అలాంటి వారి వివరాలు ఎప్పటికప్పుుడు అందించేలా ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల కార్యదర్శులతో త్వరలోనే టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాన్నారు. రైతుల పంట ఉత్పత్తులకు  గిట్టుబాటు ధరలు వచ్చేలా మార్కెట్లు బాధ్యతతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులు నష్టాలు మూటగట్టుకోకుండా, యార్డుల్లో పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ప్రైవేటు కంపెనీల దందాను పూర్తిగా అరికట్టాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ సేవలు మరింత మెరుగుపరచాలన్నారు. అన్నదాత సాగుకు దన్నుగా ఉండేలా వ్యవసాయ సాఖ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agriculture department
  • review meeting
  • telangana news
  • Thummala Nageswara Rao
  • Thummla Review Meeting

తాజావార్తలు

  • Gold and Silver Prices: ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు!

  • Asaduddin Owaisi: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి గురించి ప్రధాని మోడీకి ముందే తెలుసా.?

  • Pakistan vs Sri Lanka: శ్రీలంక చేతిలో పాక్ జుట్టు.. ఈ తప్పు చేస్తే ఇంటికే!

  • Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ..?

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

ట్రెండింగ్‌

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions