Bhadrachalam: గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
Bhadrachalam: గోదావరి మహాగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు దాటింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలం రాయన్న పేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిశా ఛత్తీస్గడ్కు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగులోనూ ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.54 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ఇక్కడ 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సహాయక చర్యల్లో నాలుగు NDRF, 4 SDRF బృందాలు పాల్గొన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సూచించింది.
Read also: Hyderabad MMTS: అలర్ట్.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు రైళ్ల రద్దు
Also Read
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. వరద రావడంతో త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం 13.29 మీటర్లకు చేరుకుంది. దీంతో పుష్కరఘాట్ మెట్ల నుంచి రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 13.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం. దీంతో 85 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువనున్న అన్నారం బ్యారేజీకి 5.11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండటంతో 66 గేట్లను ఎత్తి 5.11 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, నిజాం సాగర్ ప్రాజెక్టుకు 20 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1404.66 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. అదేవిధంగా 17.802 టీఎంసీల్లో 17.311 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండిసంజయ్
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!