Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్.. నిందితుడి అరెస్ట్
- రాజాసింగ్ ను ఫోన్ కాల్స్ తో బెదిరిస్తున్న వ్యక్తి అరెస్ట్
- బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మహమ్మద్ వసీం గా గుర్తింపు
- పదేళ్లుగా దుబాయిలో నివాసం ఉంటున్న మహమ్మద్ వసీం
- శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- వసీం పాతబస్తీ బార్కస్ కి చెందిన వ్యక్తిగా గుర్తింపు
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఫోన్ కాల్స్ తో బెదిరిస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. రాజాసింగ్ ను కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి మహమ్మద్ వసీంగా గుర్తించారు. మహమ్మద్ వసీం గత పదేళ్లుగా దుబాయిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సమాచారం రావడంతో కాపుకాచి మహమ్మద్ వసీంను అదుపులో తీసుకున్నారు. అతనిపై లుక్ ఔట్ నోటీసు ఉండడంతో హైదరాబాద్ తిరిగి వచ్చిన వసీంను పోలీసులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. వసీం హైదరాబాద్ పాతబస్తీ బార్కస్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతరు రాజా సింగ్ కు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నట్లు గుర్తించారు.
Read also: Yadadri: కోర్టులో ఆస్తి వివాదం.. మూడు రోజులుగా మార్చురీలోనే భర్త మృతదేహం
Also Read
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
అయితే ఇతనితో ఎవరైనా కాల్ చేయించారా? లేక రాజాసింగ్ పై ద్వేషంతో ఇలా చేశాడా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజాసింగ్ ను చంపేస్తానని బెదిరించడం, ఇలా ఒక్క నెంబర్ తో కాకుండా వేరే వేరే నెంబర్లతో రాజాసింగ్ ను బెదిరించేవాడు. దీనిపై రాజా సింగ్ తెలంగాణ సీఎం కు లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, సీఎం స్పందించాలని కోరారు. తన ప్రాణానికి ప్రాణహాని ఉందని, త్వరలో నిందితున్ని పట్టుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో అలర్ట్ అయిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్ సహాయంతో ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఆరా తీసారు. ఈ నెంబర్లు మొత్తం దుబాయ నుంచి వస్తున్నాయని గ్రహించారు. దీంతో ఈ నెంబర్లతో ఆరాతీయగా దుబాయ్ నుంచి బెదిరింపునకు పాల్పడిన నెంబర్లు మహమ్మద్ వసీం ఖాతా నుంచే నని గుర్తించారు. అతనిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో అదుపులో తీసుకున్నారు. దీంతో రాజాసింగ్ ను కాల్స్ చేసి బెదిరిస్తున్న వ్యక్తం అరెస్ట్ కావడంతో బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
Chandrababu Naidu: ఏపీ రాజధానిగా అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ..!
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!