పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజుల పెంపు పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న జీవోలు జారీ చేశారు. దీనిపై కొందరు విద్యార్థులు టీఏఎఫ్ఆర్ సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులు పెంచిందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పిటిషన్ విచారించిన హైకోర్టు పీజీ వైద్య ఫీజుల పెంపుపై సీజే ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 2016-19కి టీఏఎఫ్ఆర్ సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలన్న హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also: 317 జీవోను తక్షణమే రద్దు చేయాలి: కోదండరాం
విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే 30 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తి చేసిన పీజీ వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా వెంటనే ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో వైద్య పీజీ విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. గత నాలుగేళ్లుగా కోర్సు పూర్తయినా సర్టిఫికేట్లు రాక కొందరూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజా కోర్టు తీర్పుతో వారికి కొంత మేర లాభం చేకూరుతుంది.