ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్డు విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి -సిద్ధిపేట (ఎన్-765 డి.జి) రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన కృషి ఫలించింది. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక పరమైన అనుమతులకు ఆమోదం తెలపడంతో పాటు రూ.578.85 కోట్లను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఫలితంగా ఎన్ హెచ్-765 డి.జి పరిధిలోని ఎల్కతుర్తి-సిద్ధిపేట విస్తరణ పనుల్లో భాగంగా మొత్తం 63.641 కి.మీల ( 69/978 నుండి 133/619 వరకు) మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. కేంద్రం అన్ని రకాల అనుమతులు తెలపడంతో ఇక పనులు మొదలు కావడమే మిగిలి ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు మేజర్ బ్రిడ్జిలను, 6 మైనర్ బ్రిడ్జిలను పునర్ నిర్మించనున్నారు. వీటితో పాటు కొత్తగా 1 మేజర్, 26 మైనర్ బ్రిడ్జిలను కూడా నిర్మించాల్సి ఉంటుంది.
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
- Off The Record : తెలంగాణ పాలిటిక్స్ షేక్.. మోడీ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటి..?
Read Also: దమ్ముంటే వనదేవతల జాతరకు వెయ్యికోట్లు తీసుకురా.. బండి సంజయ్పై ఎంపీ కవిత ఫైర్
వాస్తవానికి ఎల్కతుర్తి- సిద్ధిపేట విస్తరణ పనులు చేపట్టాలంటూ బండి సంజయ్ కుమార్ గత కొన్ని నెలలుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎల్కతుర్తి – సిద్ధిపేట విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం తెలపడం పై హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ఆయన ప్రత్యేకంగా క్రుతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనడానికి ఈ రోడ్డు విస్తరణ పనులకు నిధుల మంజూరే నిదర్శనమని ఆయన అన్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు తొందరగా పూర్తయితే కరీంనగర్, సిద్ధిపేట తదితర ప్రాంతాల ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయని బండి సంజయ్ తెలిపారు.
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?