TGSRTC : ప్రతి కాలనీ, ప్రతి గ్రామంలోకి RTC కొత్త ప్రోగ్రాం..!
- కాశీ, అయోధ్య యాత్రలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు
- యాత్రాదానం ద్వారా పేద, అనాథ విద్యార్థులకి సదుపాయం
- పండుగలు, పెళ్లిళ్లకు అద్దె బస్సులు – ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్
- ప్రతి గడపకు RTC సేవలు – విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ ప్రోగ్రాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రజలకు చేరువయ్యేలా, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ఇటీవల పర్యాటకులు, భక్తులకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టిన ఆర్టీసీకి మంచి స్పందన లభిస్తోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే అందించిన ప్యాకేజీలకు విస్తృత స్పందన లభిస్తుండగా, త్వరలో కాశీ, అయోధ్య వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక సదుపాయాలతో బస్సులను సిద్ధం చేయాలని ఆయన అధికారులు ఆదేశించారు. ఈ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లేందుకు పలు వినూత్న ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే సౌకర్యవంతం, సుఖవంతం అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలనే ఉద్దేశంతో పలు మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా “యాత్రాదానం” అనే వినూత్న కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతను ప్రదర్శించేందుకు ముందుకొచ్చారు.
యాత్రాదానం కార్యక్రమంలో దాతలు తమ ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని పేద విద్యార్థులు, అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు వంటి వారిని తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు దాతలు ఈ కార్యక్రమానికి ముందుకొస్తుండడం అభినందనీయమని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. డిపో స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో 2023 మేలో టీజీఎస్ఆర్టీసీ “విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో బస్ ఆఫీసర్లు ప్రతి గ్రామం, కాలనీని సందర్శించి ప్రజలతో 15 రోజులకొకసారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశాల్లో బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీసులు, అలాగే సమస్యల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఆ వివరాలను పై అధికారులకు అందజేసి, తక్షణమే చర్యలు తీసుకోవడానికి సహకరిస్తున్నారు.
గ్రామాల్లో పెళ్లిళ్లు, జాతరలు, శుభకార్యాల సమయంలో రద్దీ పెరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి, ఆ సందర్భాల్లో అదనపు బస్ ట్రిప్పులు నడపాలని ఆఫీసర్లు అధికారులకు సూచిస్తున్నారు. అంతేకాకుండా, వివాహాలు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇవ్వడం, వస్తు రవాణా కోసం కార్గో సేవలను అందించడం ద్వారా ఆర్టీసీ మరింతగా ప్రజలకు చేరువవుతోంది.
ప్రతి గడపకు ఆర్టీసీ సేవలను తీసుకెళ్లాలన్న లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ తన కార్యాచరణను ముందుకు తీసుకెళ్తోంది. పర్యాటక ప్యాకేజీలు, యాత్రాదానం, విలేజ్ బస్ ఆఫీసర్ వంటి పథకాల ద్వారా సంస్థ సామాజిక బాధ్యతతో పాటు సేవా దృక్పథాన్ని మరింత బలపరుస్తోంది. త్వరలో ప్రకటించనున్న కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీలు రాష్ట్రంలోని భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.
Meena : ఆ ఫ్లైట్ లో సౌందర్యతో పాటు నేనూ వెళ్లాలి.. మీనా కామెంట్స్
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!