TGSRTC : ప్రతి కాలనీ, ప్రతి గ్రామంలోకి RTC కొత్త ప్రోగ్రాం..!
- కాశీ, అయోధ్య యాత్రలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు
- యాత్రాదానం ద్వారా పేద, అనాథ విద్యార్థులకి సదుపాయం
- పండుగలు, పెళ్లిళ్లకు అద్దె బస్సులు – ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్
- ప్రతి గడపకు RTC సేవలు – విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ ప్రోగ్రాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రజలకు చేరువయ్యేలా, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ఇటీవల పర్యాటకులు, భక్తులకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టిన ఆర్టీసీకి మంచి స్పందన లభిస్తోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే అందించిన ప్యాకేజీలకు విస్తృత స్పందన లభిస్తుండగా, త్వరలో కాశీ, అయోధ్య వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక సదుపాయాలతో బస్సులను సిద్ధం చేయాలని ఆయన అధికారులు ఆదేశించారు. ఈ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లేందుకు పలు వినూత్న ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే సౌకర్యవంతం, సుఖవంతం అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలనే ఉద్దేశంతో పలు మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా “యాత్రాదానం” అనే వినూత్న కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతను ప్రదర్శించేందుకు ముందుకొచ్చారు.
యాత్రాదానం కార్యక్రమంలో దాతలు తమ ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని పేద విద్యార్థులు, అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు వంటి వారిని తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు దాతలు ఈ కార్యక్రమానికి ముందుకొస్తుండడం అభినందనీయమని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. డిపో స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో 2023 మేలో టీజీఎస్ఆర్టీసీ “విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో బస్ ఆఫీసర్లు ప్రతి గ్రామం, కాలనీని సందర్శించి ప్రజలతో 15 రోజులకొకసారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశాల్లో బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీసులు, అలాగే సమస్యల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఆ వివరాలను పై అధికారులకు అందజేసి, తక్షణమే చర్యలు తీసుకోవడానికి సహకరిస్తున్నారు.
గ్రామాల్లో పెళ్లిళ్లు, జాతరలు, శుభకార్యాల సమయంలో రద్దీ పెరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి, ఆ సందర్భాల్లో అదనపు బస్ ట్రిప్పులు నడపాలని ఆఫీసర్లు అధికారులకు సూచిస్తున్నారు. అంతేకాకుండా, వివాహాలు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇవ్వడం, వస్తు రవాణా కోసం కార్గో సేవలను అందించడం ద్వారా ఆర్టీసీ మరింతగా ప్రజలకు చేరువవుతోంది.
ప్రతి గడపకు ఆర్టీసీ సేవలను తీసుకెళ్లాలన్న లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ తన కార్యాచరణను ముందుకు తీసుకెళ్తోంది. పర్యాటక ప్యాకేజీలు, యాత్రాదానం, విలేజ్ బస్ ఆఫీసర్ వంటి పథకాల ద్వారా సంస్థ సామాజిక బాధ్యతతో పాటు సేవా దృక్పథాన్ని మరింత బలపరుస్తోంది. త్వరలో ప్రకటించనున్న కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీలు రాష్ట్రంలోని భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.
Meena : ఆ ఫ్లైట్ లో సౌందర్యతో పాటు నేనూ వెళ్లాలి.. మీనా కామెంట్స్
తాజావార్తలు
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!