TGSRTC: బస్సు ఛార్జీల పెంపు వెనుక అసలు విషయం చెప్పిన ఆర్టీసీ
- 50 శాతం ఛార్జీలు పెంచారన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం
- పండుగల సమయంలో ప్రత్యేక సర్వీసులకే ధరల సవరణ వర్తింపు
- 2003 నుంచి అమల్లో ఉన్న జీవో ప్రకారం ఫెయిర్ రివిజన్
- సాధారణ బస్సుల్లో చార్జీలు యథాతథంగా ఉన్నాయని టీజీఎస్ఆర్టీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) తమ బస్సు టికెట్ ధరలను 50 శాతం పెంచిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వార్తలను ఖండించింది. సాధారణ ప్రయాణికులకు వర్తించే టికెట్ చార్జీలు యథాతథంగా ఉన్నాయని సంస్థ వెల్లడించింది.
ఈ ధరల పెంపు కేవలం ప్రత్యేక బస్సు సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నడిపే ప్రత్యేక బస్సు సర్వీసులలో మాత్రమే ధరల సవరణ ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులలో, ప్రయాణికులను తీసుకెళ్లిన తర్వాత ఖాళీగా తిరిగి వచ్చే బస్సుల డీజిల్ ఖర్చులను భరించేందుకు మాత్రమే ఈ ధరలను పెంచుతారని వివరించారు. ఈ నిబంధనలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారం 2003 నుంచి అమలులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ప్రజలు అటువంటి అపోహలను నమ్మవద్దని టీజీఎస్ఆర్టీసీ కోరింది. సాధారణంగా రోజువారీగా నడిచే బస్సుల్లో టికెట్ ధరలు పెంచే ప్రణాళికలు ప్రస్తుతానికి లేవని స్పష్టం చేసింది. సాధారణ బస్సులు, ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, గరుడ, సూపర్ లగ్జరీ వంటి అన్ని సర్వీసులలో సాధారణ చార్జీలే వర్తిస్తాయని అధికారులు తెలియజేశారు.
ఈ ప్రకటనతో, టికెట్ ధరల పెంపు గురించి ప్రయాణికులలో ఉన్న గందరగోళానికి టీజీఎస్ఆర్టీసీ తెరదించింది. భవిష్యత్తులో కూడా ఏవైనా మార్పులు ఉంటే, అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది.
ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎడీఎస్ అనిల్ చౌహాన్!
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!