Yadadri: కొండపై అనుమతించండి.. పర్మిషన్ లేదు.. ఆందోళన.. అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యాదగిరిగుట్టలో ఆటో కార్మికులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే ఆటో కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో ఇవాళ ఆటో సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కొండపైకి ఆటోలను నిషేధించడంతో.. జీవనోపాధి కోల్పోయామని ఆటో కార్మికుల ఆందోళన వ్యక్తం చేశారు. కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో కార్మికుల డిమాండ్ చేశారు.
అయితే.. 2022 మార్చి 31న యాదాద్రి కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతిలేదని, ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించరని.. ఈ నిర్ణయం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వస్తుందని ఆలయ ఈవో గీతారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. యాదాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్దం కింద నుంచి ఉచితంగా బస్సులను నడపనున్నారని స్పష్టం చేసారు. కొండ దిగువ నుండి పైకి, మళ్ళీ కొండ పై నుంచి కిందకు ప్రయాణం బస్సుల్లో ఉచితమేనని తెలిపారు. ఇందుకు ఆర్టీసీకి అయ్యే ఖర్చును దేవస్థానమే భరిస్తుందని ఈ విషయాన్ని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపిన మార్చిలోనే తెలిపారు. కాగా పైకి అనుమతించక పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని జీవనోపాధి కోల్పోతామని వాహన దారులు ఆందోళన చేపట్టారు. కాగా.. కొండపై భక్తుల సౌకర్యార్థమే వాహనాలు అనుమతించమని స్పష్టం చేశారు అధికారులు.
Also Read
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
అయినా కూడా కొందరు వెహికల్స్ లను కొండపై తీసుకు రావడంతో.. దానిపై పార్కింగ్ నిబంధనలను పెట్టారు అధికారులు. మే 4 నుంచి యాదాద్రి కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం వసూలు చేయనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత ప్రకటించిన విషయం తెలిసిందే. నిత్యం 50 నుంచి 70 వాహనాలు కొండపైకి వస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కొండపైకి వాహనాల అనుమతికి గంటకు రూ.500 రుసుంతోపాటు గంట దాటితే ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయనున్నట్టు స్పష్టంచేశారు. కొండపైన స్థలాభావం కారణంగా అధిక సంఖ్యలో వాహనాలకు కొండపైకి చేరకుండా నివారించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వివరించారు. అయితే అదనంగా రూ. 100 వసూలు చేసే నిబంధనను ఎత్తివేశారు.
ఏది ఏమైనా కొండపైకి వాహనాలు అనుమతి లేదని , ఒకవేళ వాహనాలు నిబంధనలు అతిక్రమించి కొండపైకి వస్తే వారికి పార్కింగ్ 500 రుసుం చెల్లించాలని వెల్లడించారు. దీంతో వాహనదారులు వచ్చే డబ్బులు పార్కింగ్ కే వెలుతున్నాయని పైవేట్ వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి. పార్కింగ్ సురుమును తగ్గించాలని, ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించాలని కోరుతున్నారు. లేదంటే కుటుంబాన్ని పోషించుకునేందుకు భారంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
Weight Lifting: భారత్కు రెండు రజతాలు.. సత్తా చాటిన లిఫ్టర్లు
తాజావార్తలు
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!