Yadadri: కొండపై అనుమతించండి.. పర్మిషన్ లేదు.. ఆందోళన.. అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యాదగిరిగుట్టలో ఆటో కార్మికులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే ఆటో కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో ఇవాళ ఆటో సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కొండపైకి ఆటోలను నిషేధించడంతో.. జీవనోపాధి కోల్పోయామని ఆటో కార్మికుల ఆందోళన వ్యక్తం చేశారు. కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో కార్మికుల డిమాండ్ చేశారు.
అయితే.. 2022 మార్చి 31న యాదాద్రి కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతిలేదని, ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించరని.. ఈ నిర్ణయం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వస్తుందని ఆలయ ఈవో గీతారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. యాదాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్దం కింద నుంచి ఉచితంగా బస్సులను నడపనున్నారని స్పష్టం చేసారు. కొండ దిగువ నుండి పైకి, మళ్ళీ కొండ పై నుంచి కిందకు ప్రయాణం బస్సుల్లో ఉచితమేనని తెలిపారు. ఇందుకు ఆర్టీసీకి అయ్యే ఖర్చును దేవస్థానమే భరిస్తుందని ఈ విషయాన్ని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపిన మార్చిలోనే తెలిపారు. కాగా పైకి అనుమతించక పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని జీవనోపాధి కోల్పోతామని వాహన దారులు ఆందోళన చేపట్టారు. కాగా.. కొండపై భక్తుల సౌకర్యార్థమే వాహనాలు అనుమతించమని స్పష్టం చేశారు అధికారులు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
అయినా కూడా కొందరు వెహికల్స్ లను కొండపై తీసుకు రావడంతో.. దానిపై పార్కింగ్ నిబంధనలను పెట్టారు అధికారులు. మే 4 నుంచి యాదాద్రి కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం వసూలు చేయనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత ప్రకటించిన విషయం తెలిసిందే. నిత్యం 50 నుంచి 70 వాహనాలు కొండపైకి వస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కొండపైకి వాహనాల అనుమతికి గంటకు రూ.500 రుసుంతోపాటు గంట దాటితే ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయనున్నట్టు స్పష్టంచేశారు. కొండపైన స్థలాభావం కారణంగా అధిక సంఖ్యలో వాహనాలకు కొండపైకి చేరకుండా నివారించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వివరించారు. అయితే అదనంగా రూ. 100 వసూలు చేసే నిబంధనను ఎత్తివేశారు.
ఏది ఏమైనా కొండపైకి వాహనాలు అనుమతి లేదని , ఒకవేళ వాహనాలు నిబంధనలు అతిక్రమించి కొండపైకి వస్తే వారికి పార్కింగ్ 500 రుసుం చెల్లించాలని వెల్లడించారు. దీంతో వాహనదారులు వచ్చే డబ్బులు పార్కింగ్ కే వెలుతున్నాయని పైవేట్ వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి. పార్కింగ్ సురుమును తగ్గించాలని, ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించాలని కోరుతున్నారు. లేదంటే కుటుంబాన్ని పోషించుకునేందుకు భారంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
Weight Lifting: భారత్కు రెండు రజతాలు.. సత్తా చాటిన లిఫ్టర్లు
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!