Konda Surekha: వదిలే ప్రసక్తే లేదు.. పోలీసులకు కొండా సురేఖ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కొండా సురేఖ ప్రచార వాహనం డ్రైవర్పై పోలీసులు దాడి చేయడంతో వరంగల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే క్రమంలో కొండా సురేఖ అక్కడికి చేరుకుని పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిమ్మల్ని వదిలి వెళ్లేది లేదని సీఐ, పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. తనపై కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.
కొండా సురేఖ ప్రచార రథం ఒకటి ఆదివారం సాయంత్రం వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తోంది. ఇదే దారిలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఇల్లు.. ప్రధాన రహదారి గుండా ప్రచార రథం సాగుతోంది. దీంతో ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రచార రథాన్ని ఆపి డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. ఇటువైపు రావద్దని, వెంటనే వెళ్లిపోవాలని డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొని… కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకోగానే ప్రచార రథ డ్రైవర్ పై మిల్స్ కాలనీ సీఐ సీరియస్ అయ్యారు. భయపడిన డ్రైవర్ వాహనంలోనే ఉండిపోయాడు. అయితే బయటకు రావాలని సీఐ అతన్ని తీవ్రంగా బెదిరించాడు. డ్రైవర్ భయంతో బయటకు రాగానే సీఐ అతడిపై దాడికి పాల్పడ్డాడు. తన ఇష్టానుసారం బూతుపురాణం అందుకున్నాడు. అక్కడున్న వారందరినీ చెదరగొట్టి డ్రైవర్తో పాటు ప్రచార వాహనాన్ని మిల్స్ కాలనీ స్టేషన్కు తరలించారు. పోలీసుల దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
- Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
- CM Revanth Reddy: కొడంగల్లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్, వేణుగోపాల్, ఇతర కార్యకర్తలు మిల్స్ కాలనీ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మిల్స్ కాలనీ స్టేషన్ కు చేరుకోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. వెంటనే వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు శాంతించారు. కాగా సీఐ సురేష్ వ్యవహార శైలి ఇప్పటి వరకు వివాదాల్లో ఉంది.
ఇదిలావుంటే, గత రెండు రోజులుగా సీఐపై పలు ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫ్యాక్షనిజంలో పనిచేస్తున్నారని ఇంతేజార్ గంజ్ సీఐ శ్రీనివాస్ ను కలిసి స్థానిక సీఐ సురేష్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై సీపీ ప్రాంతీయ స్థాయిలో విచారణ జరిపి ఇద్దరు సీఐలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.
Pawan Kalyan: తెలంగాణలో పవన్ ప్రచారం.. ఈనెల 22న వరంగల్ లో రోడ్ షో..?
తాజావార్తలు
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
-
Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే!
-
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!