Tension in Karimnagar: హనుమాన్ భక్తుల ర్యాలీలో ఉద్రిక్తత.. ఆరుగురిపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension in Karimnagar: కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలో శనివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలో హనుమాన్ మాలధారులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి వచ్చి కత్తితో నృత్యం చేసి ర్యాలీని అడ్డుకున్నాడు. ఆ వ్యక్తితో హనుమాన్ మాల దళారి వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీని నిలిపివేయాలని ఆదేశించారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలంటూ హనుమాన్ దీక్షాపరులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో హనుమాన్ దీక్షాపరులు పోలీసు పెట్రోలింగ్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే హనుమాన్ మాల వేసుకున్న భక్తులను ఎలా అరెస్ట్ చేస్తారు అని పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు.
Read also: Telangana Temperatures: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. 44.9 డిగ్రీలు దాటిపోతోంది..
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
అయితే పోలీసులు ముందుకు సాగడంతో ఓ హనుమాన్ మాలధారులు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పోలీసులు అత్యంత వేగంగా ముందుకు సాగి అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు సమాచారం అందుకున్న బీజేపీ నేతలు నాయక్ 3టౌన్ ఎదుట గుమిగూడారు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. అలాగే పోలీసుల తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక మరోవైపు ప్రాథమిక విచారణలో భాగంగా ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గొడవ జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ లను పోలీస్ లు పరిశీలిస్తున్నారు. అయితే హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వీరంగాన్ని సృష్టించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త అని తెలిసింది. స్థానిక బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణ అనుచరుడు జయదేవ్గా పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియక బీజేపీ శ్రేణులు వేరే వర్గానికి చెందిన వాడని.. హనుమాన్ భక్తులను హత్య చేసినట్లు సమాచారం.
Hyderabad: ఇంట్లో ఆలౌట్ తాగేసిన 18 నెలల చిన్నారి.. ఆ తరువాత
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!