Warangal: వరంగల్ సంరక్ష హాస్పిటల్ ముందు ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ సంరక్ష హాస్పిటల్ ముందు ఆందోళన ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. ఈనెల 11వ తేదీన కిడ్నీ సమస్యతో సంరక్ష హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చిన వాణికి ఆపరేషన్ చేపిస్తే సరిపోతుందని వైద్యులు చెప్పారు. దీంతో.. రోగికి ఆపరేషన్ చేయించారు కుటుంబసభ్యులు. అయితే.. ఆపరేషన్ వికటించి రోగి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలని సంరక్ష యాజమాన్యం చేతులెత్తేశారు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. అయితే యశోద ఆసుపత్రిలో అయ్యే ఖర్చు మొత్తం సంరక్ష యాజమాన్యం రోగి బంధువులకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. వెంటనే రోగిని హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రిలో ఐదు రోజులు వైద్యం అందించిన డాక్టర్లు సంరక్ష యాజమాన్యం డబ్బులు కట్టడం లేదని నిన్న రాత్రి వైద్యం ఆపడంతో రోగి మృతి చెందింది. వాణి మృతి చెందడంతో.. మృతదేహాన్ని సంరక్ష హాస్పిటల్ కి తరలించి హాస్పిటల్ లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Read also: Warangal: కుళ్లిన మాంసాన్ని మసాలాతో కవర్ చేస్తున్నారు.. తినే ముందు జర జాగ్రత్త
Also Read
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
సంరక్ష హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రోగి పరిస్థితి విషమించడంతో వెంటనే యశోద ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకున్నారని మృతి చెందిన రోగి కూతురు వాపోయింది. వైద్యం అందించడం లేదని సంరక్ష యాజమాన్యానికి ఎన్నిమార్లు కాల్ చేసిన ఎవరు స్పందించలేదని కన్నీరుమున్నీరుగా విలపించింది. రోగిని తరలించే వరకు తమదే బాధ్యత అని లిఖితపూర్వకంగా పత్రం రాసిచ్చి కూడా తన తల్లి మృతికి కారణకులు అయ్యారని మండిపడింది. అందుకే సంరక్ష ఆసుపత్రిలోనే తన తల్లిని మృతదేహాన్ని దహన సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. అక్కడకు పోలీసులు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుల వద్ద పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Gold Price Today: శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే!
తాజావార్తలు
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
-
Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!