Tension at Gandhi Bhavan: గాంధీభవన్ వద్ద ఉద్రికత.. షబ్బీర్ అలీ, మల్లు రవి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension at Gandhi Bhavan: గాందీభవన్ వద్ద ఉద్రక్త పరిస్థితి నెలకొంది. నూతన సచివాలయానికి బయలుదేరిన టీ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ప్రారంభానికి సిద్దమవుతున్న రాష్ట్ర కొత్త సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని వచ్చిన వార్తలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఈనేపథ్యంలోనే కొత్త సచివాలయాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడికి ఎవరూ వెళ్లేందుకు దారులన్నీ బంద్ చేశారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కొత్త సెక్రటేరియట్లో జరిగిన అగ్నిప్రమాదంపై నిజ నిర్ధారణ జరగాలంటూ అక్కడకు వెళుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాదోపవాదాలు జరిగాయి.
Read also: Krishnam Raju Wife: విశ్వనాథ్ గారి మరణంతో ఒక శకం ముగిసింది – కృష్ణం రాజు సతీమణి
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
అగ్నిప్రమాదంపై నిజ నిర్ధారణ చేప్పాలని నిరసనకు దిగేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లురవి, షబ్బీర్ అలీలను కూడా గాంధీ భవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర సీఎం కేసీఆర్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గాంధీభవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎదురుగా వున్న గేట్లను తోసుకుని ముందుకు వెల్లేందుకు ప్రయత్నించారు. పోలీసులకు , కాంగ్రెస్ నాయకులకు ఎదురుఎదురుగా నిలబడి గేట్ల తోసేందుకు ప్రయత్నించగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ ముఖ్య నేతలు అంజన్కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులో తీసుకున్న వారిని గోషా మహల్ పోలీసు స్టేషన్కు తరలించారు.
Read also: Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!
ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవం జరగనున్న కొత్త సెక్రటేరియట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం ఈ ఘటనను ‘మాక్ డ్రిల్’గా పేర్కొంటూ మూకుమ్మడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. సచివాలయానికి రాకుండా కాంగ్రెస్ నేతలను పోలీసులు గాంధీభవన్లో అరెస్టు చేశారని మహ్మద్ అలీ షబ్బీర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A massive fire broke out in the new Secretariat building, slated for inauguration on February 17. But KCR Govt is trying to hush up the incident by calling it a 'mock drill'. Police arrested Congress leaders at Gandhi Bhavan to stop them from visiting the Secretariat. pic.twitter.com/ztPiOMmzHt
— Mohammad Ali Shabbir (@mohdalishabbir) February 3, 2023
ఇది ఇలాఉంటే.. తెలంగాణ నూతన సెక్రటేరియట్ను ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారవర్గాలు తెలిపాయి. కానీ.. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు.. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. 11 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.
Allola Indrakaran Reddy: నాందేడ్ లో సీయం కేసీఆర్ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!